కూసుమంచి, మార్చి 9 : లారీని ఓవర్టేక్ చేయబోయిన ప్రైవేట్ బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటన కూసుమంచి మండలంలోని సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. 31 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున్న ప్రైవేటు బస్సు కూసుమంచి సమీపంలోని లోక్యాతండా వద్ద జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. అదుపుతప్పి పక్కనే సర్వీస్ రోడ్డుపై బస్సు పడిపోయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 13 మందికి స్వల్ప గాయాలు కాగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో బస్సులోని మిగతా ప్రయాణికులు ఒక్కసారిగా తేరుకొని జాగ్రత్తపడ్డారు. హైవే పెట్రోలింగ్, అంబులెన్స్ సిబ్బంది తక్షణమే స్పందించి వారికి ప్రథమ చికిత్స చేసి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. తర్వాత వారు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. కూసుమంచి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే బ్రిడ్జి ఉంది. అక్కడ ప్రమాదం జరిగినైట్లెతే ప్రాణనష్టం వాటిల్లేదని స్థానికులు చెబుతున్నారు.