ఖమ్మం : గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు పోషణ్ అభియాన్ ప్రాజెక్టులో భాగంగా వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ తోట ఉమారాణీ, సీడీపీఓ కవితలు హాజరయ్యారు. ఈ సందర్బంగా గర్బిణీలకు పండ్లు, పూలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ మహిళలు, శిశువుల సంపూర్ణ ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.
గర్బిణీలు మంచి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పోషణ్ అభియాన్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ రమణ, సూఫర్ వైజర్ లావణ్య, టీచర్లు నూర్జహాన్, సుమలత, శ్రీలతతో పాటు పలువురు ఆర్పీలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.