సత్తుపల్లి : వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసేందుకు గణేష్ ఉత్సవకమిటీలు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సత్తుపల్లి సీఐ రమాకాంత్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ అనుమతి http://policeportal.tspolice.gov.in/index.htm వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అనుమతి కోసం ఏసీపీకి పంపడం జరుగుతుందని, ఆ దరఖాస్తులు పరిశీలించి సక్రమంగా ఉంటే అనుమతి ఇస్తారని సీఐ తెలిపారు.
దరఖాస్తు సక్రమంగా లేకపోతే తిరస్కరిస్తామని వివరించారు. అనుపతి పత్రాన్ని గణేష్ మండపాల నిర్వహణ కమిటీసభ్యులు విధిగా మండపాల వద్ద అంటించాలని సూచించారు. వినాయకచవితి వేడుకలకు డీజే అనుమతి లేదని ఆయన పేర్కొన్నారు.