వైరా: వైరాలోని వ్యవసాయ మార్కెట్యార్డు వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్బంక్లో జరిగిన మోసానికి సంబంధించి ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెట్రోల్బంక్ పంపుల్లో మైక్రో చిప్లు అమర్చి మోసాలకు పాల్పడిన వ్యవహారంపై తునికలు, కొలతల అధికారిని ఉమారాణి, ఎస్సై వీ.సురేష్ తనిఖీల్లో వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీంతో ఆ బంక్ డీలర్ కనపర్తి దీనమ్మ, లీజు ఓనర్ తాతినేని పుల్లారావు, మేనేజర్ పత్తిపాటి శివ, కుంచుపాటి కోటేశ్వరరావు, పంపుఆరేటర్లు అంబటి కోటేశ్వరరావు, మురళీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు.