ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 13 : జేఈఈ మెయిన్స్లో ఖమ్మంలోని ప్రైవేట్ కళాశాలలు పర్సంటైల్తో సత్తా చాటినట్లు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రకటించాయి. విద్యార్థులు జాతీయస్థాయిలో సత్తా చాటారని పేర్కొన్నారు. గత నెల 27 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు ఐదురోజులు రెండువిడతలుగా నిర్వహించిన జేఈఈ పరీక్ష ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఈ పరీక్షలకు 7,960 మంది హాజరయ్యారు.
జేఈఈ ఫలితాల్లో న్యూవిజన్ విద్యార్థి అగ్రస్థానం సాధించినట్లు విద్యాసంస్థల అధినేత చుంచు గోపాలకృష్ణ ప్రసాద్ తెలిపారు. కళాశాల విద్యార్థి వర్షిత్ కొప్పుల-99.98, మహాశ్వి-99.96, ప్రభంజన్ జాదవ్-99.87 పర్సంటైల్ సాధించాడన్నారు. రుషిందర్రెడ్డి-99.81, మురళీకృష్ణ-99.80, శ్రీరామ్-99.80, నితీష్కుమార్-99.74, రేవంత్-99.62, సుమంత్-99.62, రీదా సమ్రీన్-99.60, ప్రసున్-99.43, లక్ష్మీప్రణతి-99.41, సుష్మిత-99.26, గోవర్ధన్సాయి-99.23, సాత్విక్-99.20, దివ్యశ్రీ-99.15, శ్రీచరణ్రెడ్డి-99.13, పవన్కుమార్-99.11, కేతన్కుమార్-99.11 ఉత్తమ పర్సంటైల్తో సత్తా చాటారు. ఖమ్మంలో ఏ జూనియర్ కళాశాల సాధించని 99పైగా పర్సంటైల్ 21మంది సాధించారన్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్లో నూరుశాతం పర్సంటైల్తో సత్తాచాటిన విద్యార్థులను అకడమిక్ డైరక్టర్ సీహెచ్ కార్తీక్, డైరెక్టర్ గోపిచంద్, ప్రిన్సిపాల్ బ్రహ్మచారి, శ్రీనివాసరావు అభినందించారు.
జేఈఈ మెయిన్స్లో రెజోనెన్స్ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి అత్యుత్తమ పర్సంటైల్ సాధించారని కళాశాల డైరెక్టర్స్ రాజా వాసిరెడ్డి నాగేంద్రకుమార్, కొండా శ్రీధర్రావు తెలిపారు. కళాశాలకు చెందిన కిరణ్కుమార్రెడ్డి-99.19, రాకేష్సుశాంత్-99.78, సాయిశ్రీహర్ష-97.79, వెంకటసాయిచేతన-96.92, అంకుష్వర్మ-95.72, శ్రవిష్ట-94.52, రిషిక్-93.18, యశ్వంత్- 92.71 పర్సంటైల్తోపాటు మరో 82మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారన్నారు. ఐఐటీ, నీట్, ఎప్సెట్ వంటి పోటీ పరీక్షల్లో ఘనవిజయం సాధించేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. విద్యార్థులను ప్రిన్సిపాల్స్ సతీష్, భాస్కర్రెడ్డి అభినందించారు.
జాతీయస్థాయి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కృష్ణవేణి కళాశాల అత్యుత్తమ పర్సంటైల్ను కైవసం చేసుకున్నట్లు కళాశాల అధినేత యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. కళాశాలకు చెందిన ఉజ్వలా మానస-99.01, నవదీప్-99.29, మెహక్ తబస్సుమ్-94.1, నితిన్-92.97, మోహన్రావు-91.74, శ్రీరామ్-91.67, జే సాయి-91.55, ఉమేష్చంద్రన్-90.78, శృతి- 90.54, శ్యామ్శ్రీనియో-90.46, సంధ్య-90.27 పర్సంటైల్ సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను డైరెక్టర్స్ గొల్లపూడి జగదీష్, మాచవరపు కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్ రాంచందర్రావు, ఇన్చార్జి నిరంజన్కుమార్, అధ్యాపకులు అభినందించారు.
హార్వెస్ట్ విద్యాసంస్థల్లో 100 మందికిపైగా అడ్వాన్స్డ్కి అర్హత సాధించారని విద్యాసంస్థల అధినేత రవిమారుత్ తెలిపారు. జస్వంత్-99.94 పర్సంటైల్తో, జిగ్నేష్-98.87, రాజ్వర్ధన్-98.83, అనీష్-99.78, విశ్వతేజ-99.70, ప్రణయ్-99.39, అభినవ్-99.25, సాయిసుజయ్-99.20తో రాణించారు. 96 శాతానికి పైగా పర్సంటైల్ను 19మంది విద్యార్థులు, అలాగే 90శాతానికి పైగా పర్సంటైల్ను 43 మంది విద్యార్థులు సాధించారన్నారు. ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు హార్వెస్ట్లో చదివిన విద్యార్థులు 25 మంది ఉన్నారని, జిగ్నేష్ ఎంబైపీసీలో చదువుతూ జేఈఈ అత్యుత్తమ పర్సంటైల్తో రాణించాడు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్.పార్వతిరెడ్డి అభినందించారు.
శ్రీచైతన్య కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రతిష్టాత్మక జేఈఈ మెయిన్స్లో ఆలిండియా ర్యాంక్లు సాధించారని కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. కళాశాలకు చెందిన అభిలాష్-99.88, శ్రీరామ్తేజ-99.78, వర్షిత్-99.72, తుషార్చౌదరి-99.69, నాగశ్రీ-99.67, శ్రీపూజ-99.56, సాయికుమార్-99.45, నవదీప్-99.44, సాయిదినేష్రెడ్డి-99.43, రఘునాధ్-99.40, శ్రీసాత్విక్-99.29, జెమిని నాయక్-99.23 పర్సంటైల్తో ప్రతిభ కనబర్చారు. వీరితో99కిపైగా పర్సంటైల్తో15 మంది, 98 పర్సంటైల్ పైగా 23మంది, 97 పర్సంటైల్కి పైగా 39 మంది, 90 పర్సంటైల్కి పైగా 96మంది విద్యార్థులు సాధించినట్లు పేర్కొన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అకడమిక్ డైరెక్టర్ బీ సాయిగీతిక, డీజీఎం చేతన్మాధుర్, డీన్ వర్మ, ఏజీఎంలు చిట్టూరి బ్రహ్మం, ప్రకాష్, గోపాలకృష్ణ, ప్రిన్సిపాల్స్ అభినందించారు.