బోనకల్లు, అక్టోబర్ 10 : మాయమాటలు చెప్పే కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మొద్దని బీఆర్ఎస్ మధిర యోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. మంగళవారం మండలంలోని గోవిందాపురం, లక్ష్మీపురం, తూటికుంట్ల గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆయన స్థానిక నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు.. ప్రజలకు ప్రయోజనం చేసేది లేదన్నారు. బోనకల్లు మండలాన్ని దళితబంధు పైలెట్ ప్రాజెక్టుగా సీఎం కేసీఆర్ ఎంపిక చేశారన్నారు. ప్రభుత్వం జీవో విడుదల చేసిన ప్రతి పథకం లబ్ధిదారులకు చేకూరుతుందన్నారు. ఇప్పటికే మండలంలో 22 గ్రామాల్లో అధికారులు మూడు రోజుల పాటు దళితబంధు దరఖాస్తులు తీసుకున్నారన్నారు. కొంతమంది నాయకులు పనికట్టుకొని ఈ పథకం అమలుపై అక్కస్సు వెలగకక్కుతున్నారన్నారు.
ఏ లబ్ధిదారుడు నిరుత్సాహానికి గురికాకుండా పథకాన్ని అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో మరోసారి సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలను గెలిపించుకోవాలన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడిని ప్రభుత్వ పథకాలు వస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 5 లక్షలు ఇంటి నిర్మాణం కోసం చెల్లిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వారి మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో మధిర ఏఎంసీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, మండల రైతుబంధు కన్వీనర్ వేముల ప్రసాద్, మాజీ జడ్పీటీసీ బానోత్ కొండ, యంగల కనకయ్య, కరివేద సుధాకర్, కాకాని శ్రీనివాసరావు, ముత్తారపు వెంకటి, కంచర్ల బాబు, బెజవాడ మల్లికార్జునరావు, గూడూరు రవి, పారా ఈశ్వరయ్య, పాపినేని కృష్ణ, సాదినేని శ్రీనివాసరావు, కంచర్ల అచ్చయ్య, సాదినేన వెంకటేశ్వర్లు, తమ్మారపు బ్రహ్మయ్య, తొండపు వేణు తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్తోనే సంక్షేమ పాలన..
ఓట్ల కోసం, సీట్ల కోసం మాయమాటలు చెప్పే నాయకుల మాటలు ప్రజలు నమ్మితే నష్టపోతారని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. పట్టణ పరిధిలోని అంబారుపేటలో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి జడ్పీచైర్మన్ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు సీఎం కేసీఆర్ పెద్దపీఠ వేశారన్నారు. అధికారం కోసం పాదయాత్రలు చేస్తూ అబద్దపు మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్రజల కోసం పనిచేయని నాయకులు ప్రభుత్వం చేస్తున్న పథకాలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ పాలన చూసి గ్రామాల్లోని దళితవాడలన్నీ గులాబీ జెండా వైపు పయనిస్తున్నారన్నారు. ఇది చూసి తట్టుకోలేని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై అతస్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు కనుమూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి అరిగె శ్రీనివాసరావు, 3వ వార్డు కౌన్సిలర్ భారతి, కరివేద సుధాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, శీలం వెంకటరెడ్డి పాల్గొన్నారు.