ఎర్రుపాలెం : తెలంగాణ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక పవిత్రోత్సములు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రాతఃకాల అర్చనల అనంతరం యాగశాలలో హోమాలు నిర్వహించారు. మహాపూర్ణాహుతి తర్వాత శ్రీవారి పుష్కరిణీలో చక్రస్నానం జరిపించారు అర్చకులు.
ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసశర్మ, అర్చకులు శాంతికళ్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఉప్పల కృష్ణమోహనశర్మ, కార్యనిర్వహణ అధికారి కే.జగన్మోహన్రావు, సూపరిండెంట్ బీ.శ్రీనివాస్, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.