మామిళ్లగూడెం, ఏప్రిల్ 8 : జిల్లా ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడొద్దని, సరఫరాలో నిర్వహణ లోపాలు, ఆటంకాలు లేకుండా చూసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆర్బ్ల్యూఎస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులతో కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్టచివరి ఆవాసం వరకు తాగునీరు అందేలా పటిష్ఠ కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
పాలేరు, వైరా, దుమ్ముగూడెం రిజర్వాయర్లలో రాబోయే 3నెలలకు సరిపోనూ నీరు నిల్వ ఉందన్నారు. ప్రజలకు నీటిని సక్రమంగా సరఫరా చేస్తే తాగునీటికి ఇబ్బందులు ఉండవన్నారు. మోటర్లు అన్ని కండీషన్లో ఉంచాలని, పైప్లైన్ల్లో లీకేజీలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఏదైనా కారణంతో మిషన్ భగీరథ నీరు రాకపోతే స్థానిక వనరులను ప్రత్యామ్నాయంగా సిద్ధంగా ఉంచాలన్నారు. బోర్వెల్స్, హ్యాండ్పంప్స్ అన్ని పనిచేసే స్థితిలో ఉండాలని, రిపేర్కు గురైతే వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా తాగునీరు సరఫరా చేసేందుకు అన్నిరకాల చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
అంతకుముందు ప్రిన్సిపల్ సెక్రటరీ కలెక్టర్తో కలిసి వైరా రిజర్వాయర్ ఇంటేక్వెల్ను సందర్శించి నీటి లభ్యతను పరిశీలించారు. రిజర్వాయర్లో 1.164 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నట్లు వారు తెలిపారు. మిషన్ భగీరథకు రోజూ 0.00313 టీఎంసీల నీరు అవసరం ఉండగా, రాబోయే రోజులకు తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. అనంతరం దానవాయిగూడెం చెక్డ్యామ్ను పరిశీలించారు. చెక్డ్యామ్ వద్ద కావాల్సిన నీరు అందుబాటులో ఉందన్నారు. ఈ సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్లు మయాంక్సింగ్, యువరాజ్, మిషన్ భగీరథ ఈఎన్సీ జి.కృపాకర్రెడ్డి, మిషన్ భగీరథ సీఈ కె. శ్రీనివాస్, ఇరిగేషన్ సీఈ విద్యాసాగర్, డీపీవో హరికిషన్, జడ్పీ సీఈవో వినోద్, మిషన్ భగీరథ, ఇరిగేషన్, మున్సిపల్ ఇంజినీర్లు, అధికారులు పాలొన్నారు.