ఖమ్మం: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం రైతులకు సూచించారు. సోమవారం వీ.వెంకటాయపాలెం శివాలయం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు ధళారుల బారిన పడి మోసపోకుండా ఉండేందుకు గతేడాది మాదిరిగా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పించిన గిట్టుబాటు ధరకు ధాన్యాన్ని విక్రయించాలని, డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అవుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ యరగర్ల హనుమంతరావు, సొసైటీ సీఈవో తిరుపతిరావు, టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అద్యక్షుడు తొలుపునూరి దానయ్య, నాయకులు కూరాకుల సత్యం, ఆదినారాయణ, నర్సింహారావు, సూర్యనారాయణ, వీరయ్య, రఘు, శ్రీను, అచ్చన్న, శివ, కిరణ్, ఏఈవో వినీత్ తదితరులు పాల్గొన్నారు.