కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు జాడే తిరుపతి, దుర్గం శంకర్ పాదయాత్ర ప్రారంభించారు. సోమవారం ఆసిఫాబాద్ నుంచి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు.
తెలంగాణలోని ప్రతి సామాజిక వర్గం సంతోషంగా జీవించాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉన్నదని వారు పేర్కొన్నారు. ఈ పాదయాత్రకు ఎమ్మెల్యే కోవలక్ష్మి సంఘీభావం తెలిపారు. ఈ పాదయాత్ర విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఆమె పేర్కొన్నారు.