భద్రాచలం, జనవరి 26: పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రారంభించారు. తొలుత కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలు ఏ సమస్య ఉన్నా తన దగ్గరకు వచ్చినట్లయితే వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలో నియోజకవర్గంలో అనేక సమస్యలు అప్పటి సీఎం కేసీఆర్ చొరవతో పరిష్కరించడం జరిగిందన్నారు.
అనంతరం క్యాంప్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో నాయకులు అరికెల్ల తిరుపతిరావు, రావులపల్లి రాంప్రసాద్, బొలిశెట్టి రంగారావు, తాళ్లపల్లి రమేశ్ గౌడ్, రత్నం రమాకాంత్, నర్రా రాము, గాదె మాధవరెడ్డి, ఎస్కే అజీమ్, ఎండీ నవాబ్, మానె రామకృష్ణ, ఆలీంఖాన్, దుద్దుకూరి సాయిబాబా, చింతాడి రామకృష్ణ, గంపా రాంబాబు, ఆకోజు సునీల్, పల్లంటి దేశప్ప, చింతాడి చిట్టిబాబు, గంగా భారతి, సీతామాలక్ష్మి పాల్గొన్నారు.