నమస్తే నెట్వర్క్;దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు రాష్ర్టాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. తన నటనతో ప్రత్యేక గుర్తింపు సాధించుకుని, ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి, విలక్షణ నటుడిగా, రాజకీయ నాయకుడిగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్ అన్నిరంగాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. సత్తుపల్లి పట్టణంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య భారీ మోటరుసైకిల్ ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నగర మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, సినీనటుడు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సీనియర్ కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మధిర పట్టణంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మణుగూరులో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, దమ్మపేటలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొని ఎన్టీఆర్కు నివాళి అర్పించారు. –