హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : అడవుల రక్షణ, పచ్చదనం పెంచడానికి మొదటి ప్రాధాన్యతగా అటవీశాఖ అధికారులు, సిబ్బంది పని చేయాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ అన్నారు. విధుల్లో క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్దతతో వ్యవహరించాలని తెలిపారు. పచ్చదనం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, దేశంలో మరే ఇతర రాష్ట్రం ఇవ్వడం లేదన్న విషయాన్ని గుర్తించాలని, ఆ మేరకు కొత్త సంవత్సరం సందర్భంగా అందరూ పునఃరంకితం కావాలని సూచించారు. అటవీశాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్లో ఉద్యోగులు, సిబ్బందితో కలిసి ఉన్నతాధికారులు కేక్ కట్ చేశారు. అటవీ అధికారుల సంఘం రూపొందించిన క్యాలెండర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో అటవీశాఖ జాయింట్ సెక్రటరీ ఎం.ప్రశాంతి, పీసీసీఎఫ్(కంపా) లోకేశ్ జైస్వాల్, పీసీసీఎఫ్(విజిలెన్స్) ఎలూసింగ్ మేరు, పీసీసీఎఫ్(ఎఫ్ఏసీ) ఎం.సీ.పర్గెయిన్, అదనపు పీసీసీఎఫ్ వినయ్కుమార్, హైదరాబాద్ డీఎఫ్వో ఎం.జోజి, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.
కొత్తగూడెం సింగరేణి, జనవరి 2: సింగరేణి కొత్తగూడెం ప్రధాన కార్యాలయంలో సోమవారం పర్సనల్ విభాగం ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలను డైరెక్టర్ (ఆపరేషన్స్ అండ్ పా ) చంద్రశేఖర్, డైరెక్టర్ సత్యనారాయణరావు పాల్గొని కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బసవయ్య, ఆనందరావు, వెంకటేశ్వర్లు, కవితా నాయుడు, కిరణ్కుమార్, మురళీధర్రావు, బీఆర్ దీక్షితులు, శ్రీనివాస్, ధన్పాల్ శ్రీనివాస్, శశిధర్రాజు, హన్మంతరావు, డిపార్ట్మెంట్ల ఉద్యోగులు పాల్గొన్నారు.
రామవరం, జనవరి 2: సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఏరియా జీఎం జక్కం రమేష్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్లు పాల్గొని కేక్ కట్ చేశారు. బుడగం రామకృష్ణ, జీఎం నారాయణరావు, వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, బూర రవీందర్, రమేశ్, కోటిరెడ్డి, మధన్ మోహన్, ఎన్విరాన్మెంట్ సత్యనారాయణ, డి.కిరణ్బాబు, శేషశ్రీ, బుల్లి మాధవ్, రమణారెడ్డి, మధుబాబు, తావుర్యా, శ్రీనివాస్, రాధా నాగభూషణం, మజ్జి మురళి, సుధాకర్ పాల్గొన్నారు.
ఏరియా వర్క్షాప్లో జరిగిన కార్యక్రమంలో శ్రీకాంత్, ఎండీ రజాక్, బోడ శంకర్, ఉపేందర్బాబు, ఎండీ సత్తార్పాషా, పొదిల శ్రీనివాసరావు, వై.రవి, తిమోతి, రమేశ్, భానుచందర్, యాకుబుద్దీన్, సామ్యూల్ సుధాకర్, వేణు, రాజ్కుమార్, అల్లి విల్సన్, ఐమన్స్, ఈశ్వరరావు, పీఆర్సీ రెడ్డి, కేవీ రెడ్డి, సముద్రాల శ్రీనివాస్, గిరిబాబు, దేవేందర్ పాల్గొన్నారు.
కొత్తగూడెం సింగరేణి, జనవరి 2: సింగరేణి కార్పొరేట్ పరిధిలోని సెంట్రల్ వర్క్షాప్లో సోమవారం నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. జీఎం గణపతిరావు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ముప్పాని సోమిరెడ్డి, జేబీ కుమార్, జే.శ్రీనివాస్, చిన్ని, వెంకట్రెడ్డి, సునీష్ నాయక్, అంజద్, శ్రీనివాస్ యాదవ్, రమేశ్బాబు, ఇంజినీర్లు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.