ఖమ్మం: ఖమ్మం , కొత్తగూడెం జిల్లాల్లో డిసెంబర్ 11వతేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ఇంచార్జ్ ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర ప్రసాద్ జిల్లాలోని మేజిస్ట్రేట్లకు పిలుపునిచ్చారు. శుక్రవారం న్యాయమూర్తి తన చాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని మేజిస్ట్రేట్లతో సమావేశం నిర్వహించారు. కోర్టుల్లో పెండింగులో వున్నకేసుల్లో ఎక్కువగా క్రిమినల్ కేసులేనని, వాటిలో రాజీ పడదగిన క్రిమినల్ కేసులను గుర్తించి జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు.
అందరికీ సత్వర న్యాయం అందించడమే లక్ష్యం కావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవా సంస్ధ కార్యదర్శి జావీద్ పాషా పాల్గొన్నారు.