పదుల సంఖ్యలో స్టాళ్లు.. రకరకాల వాహన మోడళ్లు.. సందడిగా స్టాళ్లు.. కిటకిటలాడుతూ మైదానం.. ప్రతినిధుల డోమోలు.. వినియోగదారుల ప్రశ్నలు.. బ్యాంకర్ల రుణ ఆఫర్లు.. కొనుగోళ్ల హడావుడి.. వెరసి ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఖమ్మం నగరంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ కళాశాల గ్రౌండ్లో రెండు రోజుల పాటు నిర్వహించిన ఆటో ఎక్స్ పో షో గ్రాండ్ సక్సెస్ అయింది. ఆదివారంతో షో ముగిసింది. వాహన ప్రేమికులు ప్రదర్శనకు విచ్చేసి తమ మనసుకు నచ్చిన కార్లు, ద్విచక్రవాహనాలు కొనుగోలు చేశారు.
ఖమ్మం నగరంతో పాటు హైదరాబాద్కు చెందిన ప్రముఖ దిగ్గజ కంపెనీలైన వోల్వో-కృష్ణ ఎక్ల్స్క్లూసివ్ ప్రైవేట్ లిమిటెడ్, మహావీర్ బెంజ్, మహావీర్ స్కోడా, సిట్రోయిన్ ప్రైడ్ మోటార్స్, ప్రైడ్ జీప్-శ్రీ కృష్ణా మోటార్స్ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బెనెల్లి-కీ వే, వెంకటరమణ బజాజ్, రాయల్ ఎన్ఫీల్డ్, ఆర్కా రెనాల్ట్, ఎంజీ రామ్ గ్రూప్, కియా ఆటోమోటివ్, రాయపూడి ఆటోమొబైల్స్, జావా ఎజ్డీ- జీకే ఆటోమోటివ్స్, కాకతీయ టొయోటా, వెంకటరమణ మోటార్స్(టాటా), వీవీసీ మహీంద్రా, గ్రీన్ హోండా-కపిల్ మోటార్స్, వజ్ర టీవీఎస్ వంటి కంపెనీలు స్టాళ్లలో తమ కంపెనీ నుంచి రకరకాల వాహనాలను స్టాళ్లలో ప్రదర్శనకు ఉంచారు. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు స్టాళ్ల వద్ద అందుబాటులో ఉండి వాహనాలు కొనుగోలు చేసే వినియోగదారులకు రుణ సదుపాయం కల్పించారు. ప్రదర్శనలో బీఆర్ఎస్ నాయకులు తాళ్లూరి జీవన్ కుమార్, కార్పొరేటర్ రాపర్తి శరత్, నమస్తే తెలంగాణ బీఎం రేనా రమేశ్, బ్యూరో ఇన్చార్జి మాటేటి వేణుగోపాల్, యాడ్స్ డిప్యూటీ మేనేజర్ బోయిన శేఖర్బాబు, సర్క్యులేషన్ మేనేజర్ రాంబాబు, యాడ్స్ సిబ్బంది పసుపులేటి నాగరాజు, సోలిపురం సురేందర్రెడ్డి, ఉల్లోజు వెంకన్న, పుట్టా ప్రభాకర్, సైరి శ్రీనివాస్, మల్లెల సురేశ్, అమృతపు కరుణాకర్, మాద దశరథ్, నమస్తే సిబ్బంది పాల్గొన్నారు.
స్టాళ్ల సందర్శనకు వచ్చిన వారిని ప్రోత్సహించేందుకు ‘నమస్తే’ బంపర్ డ్రా ఏర్పాటు చేసింది. డ్రాలో విజేతలుగా నిలిచిన వారికి ఆదివారం ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ బహుమతులు అందజేశారు.
రెండు రోజుల పాటు జరిగిన ఆటో షోలో స్టాల్స్ ఏర్పాటు చేసిన వివిధ కంపెనీల ప్రతినిధులు, బ్యాంకర్లకు ఆదివారం ‘నమస్తే తెలంగాణ’ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేతుల మీదుగా జ్ఞాపికలతో పాటు ప్రత్యేక గిఫ్ట్ హ్యాంపర్లు ఇచ్చింది.
ఆటో ఎక్ప్ పో షో వినియోగదారులకు అద్భుత అవకాశం. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే చేసిన ప్రయత్నం అభినందనీయమైంది. ఇలాంటి వేదికలు మరిన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నది. వీవీసీ మోటార్స్కు దశాబ్దాల నుంచి మంచి ఆదరణ ఉన్నది. మా కంపెనీ నుంచి వేలాది మంది వాహనాలు తీసుకున్నారు. మా వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఈవీ వాహనాలను సైతం అందుబాటులోకి తీసుకువస్తున్నాం.
అతి తక్కువ వడ్డీ రేట్లతో వాహనదారులకు రుణసదుపాయం కల్పించడం ఎస్బీఐ ధ్యేయం. మా బ్యాంక్ కేవలం 8.85శాతం వడ్డీ రేట్లకే రుణం ఇస్తుంది. అలాగే తక్కువ ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటాం. రెండు రోజుల ఎక్స్ పో షోలో మా స్టాల్ను ఖమ్మం నగరం నుంచే కాక జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు సందర్శించారు. ఒకే వేదికపైకి వాహనాలు, బ్యాంకర్లను తీసుకురావడం అభినందనీయం. షో ద్వారా వినియోగదారులు సులభంగా రుణ సదుపాయం, వాహన కొనుగోలు అంశాలను తెలుసుకున్నారు.
వోల్వో కంపెనీ కార్లు సెఫ్టీకి ప్రసిద్ధి. అలాగే లగ్జరీకి సింబల్. మా కంపెనీ నుంచి ఎన్నో ఫీచర్లు ఉన్న వాహనాలను ప్రదర్శనకు ఉంచాం. మా మోడళ్ల గురించి తెలుసుకోవాలనుకునే ఎంతోమంది మా స్టాల్ను సందర్శించారు. ఒకటి కంటే ఎక్కువ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న వారి కోసం హైదరాబాద్ నుంచి డెమో వాహనాలను తీసుకువస్తాం. ఎక్స్ పోలో మా స్టాల్కు మంచి ఆదరణ లభించింది.
ఆటో ఎక్స్ పో నిర్వహణ తీరు చాల బాగుంది. విశాలమైన మైదానంలో ‘నమస్తే’ షో ఏర్పాటు చేయడం అభినందనీయం. మా కంపెనీ స్టాల్ను వందలాది మంది సందర్శించారు. మా కంపెనీ నుంచి విడుదలయ్యే ప్రతి మోడల్కు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఓక్స్ వ్యాగన్ వాహనాలకు మార్కెట్లో మంచి క్రేజ్ ఉన్నది. ప్రదర్శనకు జిల్లావాసుల నుంచి మంచి ఆదరణ లభించింది.
ఆటో ఎక్స్ పో ద్వారా మా కంపెనీ మోడళ్లు వినియోగదారులకు చేరువయ్యాయి. జిప్ వాహనాలకు మార్కెట్లో ఓ ప్రత్యేకత ఉంది. ఎక్స్ పోలో ఎంతోమంది వాహన ప్రేమికులు మా కంపెనీ వాహనాలను పరిశీలించారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి నూతన కస్టమర్లను సొంతం చేసుకున్నట్లయింది.
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ యాజమాన్యాలు ఆటో ఎక్స్ పో ఏర్పాటు చేయడం మంచి విషయం. వినియోగదారుల సౌలభ్యం కోసం అన్ని కంపెనీల వాహనాలను ఒకే వేదికపైకి తీసుకురావడం, బ్యాంకర్లనూ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం. మా కంపెనీ నుంచి అధునాతన సౌకర్యాలతో రూపుదిద్దుకున్న వాహనాలను ప్రదర్శనకు ఉంచాం. ఒక్కో వాహనం ధర రూ.9.50 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.26 లక్షల వరకు ఉన్నాయి. ఎక్స్పో షోలో మా స్టాల్కు వినియోగదారుల నుంచి ఎంతో ఆదరణ లభించింది.
ఒకే వేదికపైకి ద్విచక్ర వాహనాలు, కారు కంపెనీలను తీసుకురావడం అభినందనీయం. రెండు రోజుల పాటు సాగిన ఆటో ఎక్స్ పో షోలో మా కంపెనీ స్టాల్ను ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎంతోమంది సందర్శించారు. ఎంజెట్ వాహనాలకు ప్రస్తుతం మంచి క్రేజీ ఉంది. మా కంపెనీ నుంచి రూ.15 లక్షల నుంచి రూ.22 లక్షల వరకు ధర పలికే వాహనాలను ప్రదర్శనకు ఉంచాం. వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా మా మోడళ్లు ఉంటాయి.
వినియోగదారులకు నమ్మకమైన, నాణ్యమైన వాహనాలను అందించడమే మహావీర్ గ్రూప్ ధ్యేయం. మార్సిడోస్, స్కోడాతో పాటు బెంజ్ కార్లు సైతం మా కంపెనీ మా సొంతం. ఎక్ప్ పోలో మా స్టాల్ను సందర్శంచిన ప్రతి కస్టమర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎక్స్ పో ఆలోచన చేసి ‘నమస్తే’ మంచి పని చేసింది. ఇలాంటి ప్రదర్శనలతో కంపెనీలతో పాటు ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది.
టీవీఎస్ కంపెనీ అంటే తెలియని వారు ప్రస్తుత సమాజంలో ఎవరూ ఉండరు. మా కంపెనీ వినియోగదారుల అభిప్రాయాలను గౌరవిస్తుంది. వారి అభిరుచులకు అనుగుణంగా నూతన మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తుంది. పల్లెలు మొదలుకొని పట్టణాల వరకు ఎవరైనా టీవీఎస్ వాహనాలను ఆదరిస్తారు. మా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యం.