కల్లూరు, ఫిబ్రవరి 19 : కల్లూరు మండలంలో ఖమ్మం ఎంపీ, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆదివారం విస్తృతంగా పర్యటించారు. తొలుత శ్రీసంతాన వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ గుర్రం శ్రీనివాసరావు మనుమరాలి అన్నప్రాసన వేడుకకు హాజరయ్యారు. అనంతరం రెండ్రోజులుగా బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాశివరాత్రి వేడుకల్లో మాట్లాడుతూ 140 ఏళ్లకొకసారి వచ్చే మహాశివరాత్రి శనిత్రయోదశి నాడు ఈసారి శివపార్వతుల లోకకల్యాణం కన్నులపండువగా సాగిందన్నారు.
కైలాసవాసుడి కల్యాణానికి భక్తులు అధికసంఖ్యలో హాజరైనట్లు పేర్కొన్నారు. వీరిని బ్రహ్మకుమారీస్ శాలువాతో సత్కరించారు. చండ్రుపట్లలో మాజీ సర్పంచ్ వల్లభనేని భాస్కరరావు కుమారుడు శ్రీనివాసరావు ఇటీవల మృతిచెందడంతో కుటుంబసభ్యులను పరామర్శించారు. కప్పలబంధంలో ఇటీవల ఎన్ఎస్పీ కాల్వలో పడి మృతిచెందిన ఇద్దరు రైతుల కుటుంబాలను పరామర్శించారు.
ఆయా కార్యక్రమాల్లో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్బాబు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, రైతుబంధు సమితి జిల్లా, మండల సభ్యులు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, యూత్ ప్రెసిడెంట్ పెడకంటి రామకృష్ణ, ఏఎంసీ వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, కప్పలబంధం సర్పంచ్ నందిగామ ప్రసాద్, చండ్రుపట్ల నాయకులు వల్లభనేని రవి, వెంకటేశ్వరరావు, కిశోర్, పాల్వంచ డీఎస్పీ వెంకటేశ్, ఖమ్మం ట్రాఫిక్ సీఐ అంజలి, గుర్రం తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.