టీబీజీకేఎస్.. సింగరేణి ప్రగతిలో కీలకపాత్ర పోషించడమేగాక అనేక హక్కులు సాధించి నల్లసూర్యుల మనసు గెలుచుకున్నది. ఇప్పటికే ‘గుర్తింపు’ ఎన్నికల్లో రెండుసార్లు విజయం సాధించగా, ముచ్చటగా మూడోసారి గెలిచే లక్ష్యంతో ముందుకెళ్తున్నది. వారసత్వ ఉద్యోగాలు పోగొట్టిన జాతీయ సంఘాల వైఖరిని ఎండగడుతూనే.. తాము సాధించిన ఘనతను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నది. గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సారథ్యంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, సౌకర్యాలే తిరిగి గెలిపిస్తాయన్న ధీమా నాయకుల్లో వ్యక్తమవుతున్నది. ఇక ఏఐటీయూసీ, ఐన్టీయూసీలు చేసిందేమీ లేదని, బుధవారం జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్కు ఓటు వేసి గెలిపించాలని ఆ సంఘం నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 26 : తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం.. సింగరేణి చరిత్రలో లేని విధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమేగాక లెక్కకు మించి హకులు సాధించి కార్మికుల మనసును గెలుచుకున్నది. కేసీఆర్ సర్కారు ప్రోత్సాహం, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సారథ్యంలో సంస్థ ప్రగతికి కృషి చేయడమేగాక కార్మికుల పక్షాన నిలిచి అనేక ప్రయోజనాలు సాధించింది. కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకొని ఒక పోరాటమైనా లేకుండా దేశ చరిత్రలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ సాధించని అభివృద్ధి సాధించింది. నూతన హకులతో పాటు జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన హకులను కూడా సాధించి కార్మికుల గుండెల్లో గూడు కట్టుకున్నది.
1998, 2001లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన ఏఐటీయూసీ ఎలాంటి హకులు, ప్రయోజనాలు కల్పించిందో కార్మిక వర్గానికి తెలుసు. అందుకే 2003లో జరిగిన ఎన్నికల్లో ఆ సంఘాన్ని ఓడించి.. ఐఎన్టీయూసీకి పట్టం కట్టారు. ఐన్టీయూసీతోనైనా తమకు లాభం జరుగుతుందేమోనని ఆశించిన కార్మిక లోకానికి చివరికి నిరాశే మిగిలింది. ఇలా ఏఐటీయూసీ కాకపోతే.. ఐఎన్టీయూసీ.. ఐఎన్టీయూసీ కాకపోతే.. ఏఐటీయూసీ గెలుచుకుంటూ వచ్చాయి. 12 ఏళ్లు గుర్తింపు కార్మిక సంఘాలుగా ఉండి కార్మికులకు చేసిందేమీ లేకపోగా.. వారసత్వ ఉద్యోగాలు ఊడగొట్టింది. ఈ విషయాన్ని కార్మిక కుటుంబాలు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నాయి. అలాంటి వారికి ఓట్లు అడిగే హక్కు లేదని, ఈ ఎన్నికల్లోనూ టీబీజీకేఎస్కే పట్టం కట్టి.. ఏఐటీయూసీ, ఐన్టీయూసీలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.
2012 అక్టోబర్ 5న.. జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మిక వర్గం టీబీజీకేఎస్ను ఆదరించింది. 23,311 ఓట్లు అందించి గుర్తింపు కార్మిక సంఘంగా టీబీజీకేఎస్ను నిలబెట్టింది. కేసీఆర్ సర్కారు సహకారంతో సింగరేణి చరిత్రలో లేనివిధంగా అనేక హకులు సాధించి కార్మికుల చేత ప్రశంసలు అందుకున్నది. 2017లో జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లోనూ విజయం సాధించింది. 23,845 ఓట్లు సాధించింది. కార్మికులు గత ఎన్నికలకంటే 534 ఎక్కువ ఓట్లతో గెలిపించారు. ఇక ఈ నెల 27న నిర్వహించనున్న గుర్తింపు ఎన్నికల్లోనూ మరోసారి గెలిచేందుకు టీబీజీకేఎస్ ఉవ్విళ్లూరుతున్నది. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత సూచనలతో నాయకులు హ్యాట్రిక్ సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.
జాతీయ కార్మిక సంఘాలు కాలరాసిన వారసత్వపు ఉద్యోగాల హక్కును కారుణ్యం ద్వారా తీసుకువచ్చింది. 16,000 మందికి ఉద్యోగాలిప్పించింది.
పెండింగ్లో ఉన్న 600 మంది డిపెండెంట్లకు తిరిగి ఉద్యోగాలు. l
ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ల ద్వారా మందికి కొత్తగా ఉద్యోగాలు. l 600 మంది డిస్మిస్డ్ కార్మికులకు తిరిగి ఉద్యోగాలు. l వికలాంగులకు సర్ఫేస్ ఉద్యోగాలు.
లాభాల వాటా 16 శాతం నుంచి 32 శాతానికి పెంపు. సకలజనుల సమ్మె కాలపు వేతనం పంపిణీ.
తెలంగాణ ఇంక్రిమెంట్
కార్మిక కుటుంబాలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం, రూ.10 లక్షల గృహ రుణం, వడ్డీ చెల్లింపు.
ఉద్యోగం వద్దనుకుంటే డిపెండెంట్లకు రూ. 25 లక్షల చెల్లింపు (కోలిండియాలో లేదు)
ఐఐటీ, ఐఐఎంలలో సీటు సాధించిన కార్మికుల పిల్లలకు ట్యూషన్ ఫీజు, రీయింబర్స్మెంట్. l సొంత ఇల్లు ఉండే కార్మికులకు 100 యూనిట్ల విద్యుత్ చార్జీల చెల్లింపు.
కార్మికుల కమ్యూనిటీ హాళ్లకు ఏసీ సౌకర్యం
గని ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబానికి రూ. 20 లక్షల మ్యాచింగ్ గ్రాంట్.
విధులు, డ్యూటీలో సహజ మరణం పొందిన కార్మిక కుటుంబానికి రూ.20 లక్షల మ్యాచింగ్ గ్రాంట్.
రూ. 175 కోట్ల వృత్తి పన్ను బకాయిలు పర్మినెంటుగా రద్దు.
మహిళలకు ప్రసూతి సెలవులు l పీఎంఈ మస్టర్ కల్పన.
కోలిండియాలో లేనివిధంగా సింగరేణిలో మహిళలకు డిపెండెంట్ ఉద్యోగాల్లో అవకాశం l పెళ్లయిన, విడాకులైన, వితంతువు, ఒంటరి మహిళ కూతురు, వితంతువు కోడలుకు కూడా డిపెండెంట్ ఉద్యోగాలకు అవకాశం.
మహిళా కార్మికులకు చైల్డ్ కేర్ లీవ్ రెండేళ్లు.
సింగరేణి కార్మికుల ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు కోసం రామగుండంలో సింగరేణి మెడికల్ కళాశాల ఏర్పాటు. కార్మికుల పిల్లలకు 5 శాతం రిజర్వేషన్.
సింగరేణి ఏరియా ఆసుపత్రి, కొత్తగూడెం కార్పొరేట్ ఆసుపత్రిలో సిటీ సాన్, ఎంఆర్ఐ సాన్ ఏర్పాటు.
2014 మార్చి 31 వరకు వేచి ఉన్న 3200 మంది డిపెండెంటులందరికీ ఒకేసారి ఉద్యోగాలు
బేసిక్పై 1 శాతం విద్యుత్ చార్జీలు రద్దు చేసి ఏసీ పెట్టుకోవడానికి అనుమతి, ఉచిత విద్యుత్.