చింతకాని : గ్రామాల్లో క్రమం తప్పకుండాడ్రైడే నిర్వహించాలని ఎంపీడీవో బీ రవికుమార్ అన్నారు. ఆయన మండలంలో డ్రైడే కార్యక్రమాల్లో భాగంగా నాగిలిగోండ, చింతకాని, గాంధీనగర్, కోదుమూరు, తిర్లాపురం, చిన్నమండవ, మత్కేపల్లి తదితర గ్రామాలలో ఆయా గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో డ్రైడే కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా గ్రామాలలో జరుగుతున్న పారిశుధ్య పనులను ఆయన ఆకస్మికంగా వెళ్ళి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో రానున్న డెంగీ సీజన్ దృష్ట్యా పల్లెల్లో పారిశుధ్యపనులు కోనసాగించాలని సర్పంచులు, కార్యదర్శులకు సూచించారు.
పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్వాన్ని సహించనని, రోడ్ల వెంట నీటి నిల్వలు, పిచ్చిమొక్కలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్, సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.