చండ్రుగొండ : పాఠశాలల్లో మౌలిక సదుపాయాల్ని కల్పించాలని ఎంపీడీవో అన్నపూర్ణ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం తుంగారం పంచాయతీలోని ప్రభుత్వ పాఠశాలను ఆమె పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత పనులను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…ప్రభుత్వం పాఠశాలల పునః ప్రారంభంపై ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వచ్చే నెల 1వ తేదీ కల్లా పాఠశాలలను సిద్దం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ తోట తులసీరాం, జీపీసెక్రటరీ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.