ఖమ్మం, మార్చి 2 : రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర తన కుటుంబ సభ్యులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ రవిచంద్ర-విజయలక్ష్మి దంపతులు హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి శనివారం కుటుంబ సభ్యులతో వెళ్లి కేసీఆర్ను కలిసి శాలువాతో సతరించారు.
నూతన వస్ర్తాలతోపాటు పండ్ల బుట్టను బహూకరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎంపీ వద్దిరాజు దంపతులతోపాటు వారి కూతురు-అల్లుడు డాక్టర్ గంగుల గంగాభవాని-సందీప్, తనయుడు వద్దిరాజు నాగరాజు, మనవళ్లు గంగుల సనవ్, సౌరవ్లు కలిసి ధన్యవాదాలు చెప్పారు.