ఖమ్మం, మార్చి 31 : ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించలేని చేతకాని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఎండిపోతున్న పంటలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ జిల్లా నాయకులు ధ్వజమెత్తారు. ఆదివారం ఖమ్మం నగరంలోని తెలంగాణభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడారు.
కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, నదులు అని ఆయన లేకపోతే నీటిఎద్దడి వస్తుందని కేవలం 4 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించిందని రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. కేవలం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్ల వచ్చిన కరువుగా గుర్తించాలన్నారు. మన చేతుల్లో ఉన్న వ్యవస్థలను మనం 10 ఏళ్లు భద్రంగా కాపాడుకున్నామని అందుకనే కేసీఆర్ పాలనలో కరువులేదన్నారు. నాగార్జునసాగర్లో ఉన్న నీటిని తాగునీటి కోసం తీసుకోలేని దుస్థితి ఈ ప్రభుత్వానిది అన్నారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోవడమే కాదు, తాగునీటికి కూడా సమస్యలు వచ్చాయని, గడచిన 10ఏళ్లలో ఎప్పుడైనా ఈ పరిస్థితి వచ్చిందాలేదా అని ప్రజలు ఆలోచన చేయాలని పువ్వాడ అన్నారు. మార్చిలోనే ఈ సమస్య ఉంటే ఏప్రిల్, మేలో ఎంత నీటిఎద్దడి ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణలో ఒక నీటి సమస్యే కాకుండా కరెంట్ సమస్య కూడా రాష్ట్రంలో నడుస్తున్నదని, రానున్నరోజుల్లో ఇది తీవ్రం అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4నెలలు అవుతున్నా ఇంతవరకు రైతులకు రైతుబంధు పడలేదన్నారు. రైతులకు ఎకరానికి నష్టంకింద రూ.30 వేలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. పాలేరులో కేవలం సగం టీఎంసీ మాత్రమే నీరు ఉన్నాయని ఆ నీరు కేవలం వారంరోజులు మాత్రమే వస్తాయని ఆ తర్వాత జిల్లా ప్రజల పరిస్థితి ఏంటి..? ముందుచూపు లేకపోతే ఇలానే ఉంటుందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.
తెలంగాణ రైతుబిడ్డగా రైతుల కష్టాలు దగ్గరగా చూసిన వ్యక్తిగా ఇవ్వాళ రాష్ట్రంలో ఉన్న సమస్యలను చూసి చాలా బాధపడుతున్నానని బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. జిల్లా ప్రజలకు రైతుబిడ్డగా సాయం చేద్దామని మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామని రైతులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారని అన్నారు. పంట పొట్ట దశకు వచ్చిందని ఒక తడి నీరు వదిలి ఉంటే పంట చేతికి వచ్చేదని నేలకొండపల్లిలో ఓ రైతు కన్నీరు పెట్టుకున్నాడని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో బియ్యం ఎగుమతుల్లో రాష్ట్రం నెంబర్వన్ స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకొచ్చామో, రైతుల పక్షాన అలానే నిలుస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ను గెలిపించి కేసీఆర్కు అండగా నిలవాలన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు నిండుగా నీళ్లతో కళకళలాడేవని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. పాలేరు రిజర్వాయర్ను తాను 1993 నుంచి చూస్తున్నానని, ఇప్పటి మాదిరిగా ఎప్పుడు కూడా ఎండిపోలేదన్నారు. కేసీఆర్ పాలనలో ఎండాకాలం కూడా చెరువులు, కుంటలు మత్తళ్లు దూకేవని పేరొన్నారు. నీళ్లు లేక ఎండిపోతున్న పాలేరు రిజర్వాయర్, నేలకొండపల్లిలో సాగునీరు అందక ఎండిన పంట పొలాలను చూసి వచ్చామని, రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనకు భిన్నంగా రేవంత్ పరిపాలన కొనసాగుతున్నది, ఆ పదేళ్లు రైతులు, ప్రజలు కరెంట్, సాగు, తాగురు పుషలంగా అందుబాటులో ఉండి సంతోషిస్తే, ఇప్పుడు విపతర పరిస్థితులు ఎదురొంటున్నారని వ్యాఖ్యానించారు. పంటలు ఎండిపోయి విలపిస్తున్న రైతున్నలకు ఎకరాకు రూ.30 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు గౌరవ మర్యాదలు అందుకున్న నాయకులు ఈ కష్టకాలంలో పార్టీని వీడివెళ్లడం సమంజసం కాదన్నారు. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ పార్టీని వీడివెళ్లడం తీవ్ర విచారకరమన్నారు. నామాను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఖమ్మంజిల్లా రైతుల ప్రయోజనాలు కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం ముందుండి పోరాడుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోసం జిల్లా నాయకత్వం మొత్తం ఐక్యంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ రైతులకు అండగా ప్రచారం చేయడానికి పలు జిల్లాల పర్యటనకు బయలుదేరారని ఆయనకు మద్దతుగా, అండగా జిల్లా నాయకత్వం ఉంటుందన్నారు. ఎంపీ నామా బీఆర్ఎస్ పార్టీ లోక్సభా పక్షనేతగా ఉండి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ సుపరిచితుడని, ఈ జిల్లా రాజకీయాల్లో ఒక సీనియర్ నాయకుడుగా ఉండి ఎకడ కూడా ఎలాంటి మచ్చలేని వ్యక్తిగా పేరు సంపాదించారని అన్నారు. జిల్లా ప్రజలకు, ఇదే కరువు కాలంలో గతంలో తెలంగాణ రాకముందు, తన నామా సేవా ట్రస్టు ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారని, ట్యాంకర్ల ద్వారా ఈ జిల్లా ప్రజలకు సేవలు అందించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంలో బిల్లు పెడితే మొట్టమొదటి ఓటేసిన వ్యక్తి నామా అని గుర్తుచేశారు.
కాంగ్రెస్ నాయకులకు ముందుచూపు, ప్రణాళికలేని కారణంగానే జిల్లాలో రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించలేని పరిస్థితి ఉందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ప్రభుత్వం వైపత్యం సృష్టంగా కనిపిస్తుందన్నారు. వంద రోజుల్లో ప్రజలకు ఏమి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం అన్నారు. నామామ గెలుపు కోసం నాయకులు మొత్తం ఐక్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, బానోత్ మదన్లాల్, మెచ్చా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కొండబాల కోటేశ్వరరావు, కోనేరు చిన్ని, బానోత్ చంద్రావతి, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్కుమార్, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.