దుమ్ముగూడెం, ఫిబ్రవరి 29 : మారాయిగూడెం సమ్మక్క-సారలమ్మ జాతర గురువారం మూడో రోజుకు చేరింది. సరిహద్దు రాష్ర్టాలైన ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు దంపతులు వనదేవతలను దర్శించుకొని గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. జాతర సంప్రదాయం ప్రకారం దేవర బాలలతో కలిసి పూజలు నిర్వహించారు.
మధ్యాహ్నం సమయంలో పూజారులు వనదేవతలను గిరిజన సంప్రదాయ నృత్యాలు, మేళతాళాల నడుమ గద్దెకు చేర్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొమ్ము నృత్యాలు, కోలాటాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎస్సై కేశవ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అన్నె సత్యనారాయణమూర్తి, కణితి రాముడు, ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, అపకా వీర్రాజు, తునికి కామేశ్, మడకం ప్రసాద్, ఇర్పా చంటి, కణితి రాజమ్మ, అపకా శ్రీను, మోతుకూరి శ్రీకాంత్, దామెర్ల శ్రీనివాస్, బొల్లి శేఖర్, కొమ్ము రంజిత్, కొత్తా మల్లేశ్, పొడియం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.