ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను నిరసిస్తూ కోల్బెల్ట్ వ్యాప్తంగా కార్మికలోకం భగ్గుమన్నది. ఈ నెల 12న రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)ను ప్రారంభించేందుకు ఆయన రామగుండం వస్తున్నారు. మోదీ పర్యటనను నిరసిస్తూ గురువారం బొగ్గుబావులు, డిపార్ట్మెంట్ల వద్ద కార్మికులు, ఉద్యోగులు, పలు కార్మిక సంఘాల నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మూడు రోజుల ఆందోళనలో భాగంగా మొదటి రోజు నల్లసూర్యులు చేపట్టిన నిరసనకు విశేష స్పందన లభించింది. ‘మోదీ.. గో బ్యాక్’ అంటూ పెద్దపెట్టున నినదించారు. సింగరేణిని ప్రైవేట్పరం చేయాలని చూస్తున్న మోదీకి ఈ ప్రాంతంలో అడుగుపెట్టే అర్హత లేదని ముక్తకంఠంతో పేర్కొన్నారు. ఇక.. టీబీజీకేఎస్తోపాటు పలు సంఘాల నాయకులు సమావేశమై మోదీ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. నేడు(శుక్రవారం) గోదావరిఖనిలో నిర్వహించనున్న భారీ ర్యాలీకి తరలిరావాలని పిలుపునివ్వగా, చీకటిసూర్యులు సిద్ధమవుతున్నారు.
కొత్తగూడెం సింగరేణి/రామవరం/ఇల్లెందు/మణుగూరు టౌన్, నవంబర్ 10మంచిర్యాల, నవంబర్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభానికి వస్తున్న ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గురువారం సింగరేణి వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. బొగ్గుగనులను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్న నరేంద్ర మోదీకి సింగరేణి గడ్డ మీద అడుగుపెట్టే హక్కే లేదంటూ కార్మికులు ముక్త కంఠంతో నినదించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి.. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఎక్కడికక్కడ నిరసనలు..
మందిమర్రి ఏరియాలో కేకే 5, కేకే 1 గనులు, వర్క్షాపులు, ఆర్కే ఓసీపీ, ఆర్కే-1 గనుల్లో నిర్వహించిన నిరసనల్లో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సంపత్, ఏరియా కార్యదర్శి రాజశేఖర్ పాల్గొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్కే- 5, ఎస్సార్పీ-3, ఓసీపీ, ఏరియా వర్క్షాప్, సీహెచ్పీ, ఆర్కే న్యూటెక్, ఆర్కే -6, ఎస్సార్పీ-1, ఇందారం -1ఏ గనులతో పాటు డిపార్ట్మెంట్లలో జరిగిన నిరసనల్లో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షులు అన్నయ్య, మంద మల్లారెడ్డి పాల్గొన్నారు. బెల్లంపల్లి ఏరియాలో శాంతిగని, కాసిపేట-1 గనులు, బెల్లంపల్లి ఏరియా దవాఖానల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మాల్రాజు శ్రీనివాసరావు పాల్గొన్నారు. కైర్గూడ ఓసీపీ, గోలేటి జీఎస్పీ, గోలేటి -1, గోలేటి జీఎం ఆఫీస్, డిపార్ట్మెంట్లలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు. టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగెం ప్రకాశ్రావు, కార్పొరేట్ చర్చల ప్రతినిధి ధరావత్ మంగీలాల్ పాల్గొన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని కైర్గూడ ఓసీపీ, గోలేటి సీహెచ్పీ, జీఎం కార్యాలయం, సివిల్ డిపార్టుమెంట్లలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సిబ్బంది, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు ఉన్నారు.
ఇల్లెందు : కోయగూడెం ఓసీ వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నటీబీజీకేఎస్ నాయకులు, కార్మికులు
రామవరం : సింగరేణి ఏరియాలోని పీవీకే 5 ఇన్ైక్లెన్ వద్ద కార్మికులతో మాట్లాడుతున్న టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు
కొత్తగూడెం సింగరేణి: కొత్తగూడెంలోని కార్పొరేట్లో నిరసన తెలుపుతున్న ఎస్అండ్పీసీ సిబ్బంది
పెద్దపల్లి జిల్లాలో..
గోదావరిఖని/రామగిరి/యైటింక్లయిన్ కాలనీ, నవంబర్ 10 : రామగుండం డివిజన్-1లోని జీడీకే-2, జీడీకే-11గనులతో పాటు తదితర చోట్ల నిర్వహించిన నిరసనల్లో టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగెర్ల మల్లయ్య, టీబీజీకేఎస్ ఆర్జీ-1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్రావు, ఆర్జీ-3 జీఎం కార్యాలయం, ఓసీపీ-1,2 బేస్ వర్క్షాపు, ఏపీఏ ప్రాజెక్టులో ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు, ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-1 ప్రాజెక్టులో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి పాల్గొని మాట్లాడారు. కోల్సిటీలోని భాస్కర్రావు భవన్లో గురువారం సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి కే రాజన్న, సీపీఐఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రామాచారి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి మోదీ రాకను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
కొత్తగూడెంలలో..
కొత్తగూడెం సింగరేణి/రామవరం/మణుగూరు టౌన్/ఇల్లెందు, నవంబర్ 10 : పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మించిన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్)ను ఈ నెల 12 ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఆయన పర్యటనపై సింగరేణియులు భగ్గుమంటున్నారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బావులను ప్రైవేటీకరించేందుకు యత్నిస్తున్నదని, కార్మికుల డిమాండ్లను పట్టించుకుని పరిష్కరించే వరకు ప్రధాని మోదీని రామగుండంలో అడుగుపెట్టనీయని గురువారం గనుల వద్ద నిరసన వ్యక్తం చేశారు. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియాల్లో టీబీజీకేఎస్తో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కొత్తగూడెం కార్పొరేట్, రుద్రంపూర్ జీకే ఓసీ, పీవీకే 5, సత్తుపల్లి జేవీఆర్ ఓసీ గనుల వద్ద ఆందోళనలు చేపట్టారు. కొత్తగూడెం ఏరియాలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావ్ పాల్గొన్నారు. సింగరేణీయులంతా ఒక్కటిగా కలిసి ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకుంటామన్నారు.