ఖమ్మం, జూలై 15: అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని స్పష్టం చేశారు. తన సిఫార్సు ద్వారా 20 మందికి రూ.18.53 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కాగా.. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో శనివారం లబ్ధిదారులకు వాటిని ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారని అన్నారు. దీనిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాల నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన వైద్య రంగానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యమిచ్చారని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి.. వరంలాంటిదని అన్నారు. ఈ నిధి పేదల ఆరోగ్యానికి కొండంత ధైర్యాన్ని ఇస్తోందని అన్నారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో కొత్త కొత్త నాయకులు వచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజలెవరూ వాటిని నమ్మవద్దని సూచించారు. రాష్ట ప్రజలందరూ సీఎం కేసీఆర్కు అండగా నిలవాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు చింతనిప్పు కృష్ణచైతన్య, ముత్యాల సత్యనారాయణ, లక్ష్మారెడ్డి, ఉమాశంకర్, పసుపులేటి మోహన్రావు, కట్టా కృష్ణార్జునరావు, పోట్ల శ్రీను, పోగుల శ్రీను, డేరంగుల బ్రహ్మం, చెరుకుపల్లి రవి, దుగ్గినేని శ్రీనివాస్, మీగడ శ్రీనివాస్, కొప్పుల ఆంజనేయులు, బంక మల్లయ్య, మద్దెల విజయ్, చామకూరి రాజు, బత్తుల వీరారెడ్డి, సామినేని అప్పారావు తదితరులు పాల్గొన్నారు.