ఖమ్మం, మార్చి 6 : సీఎం రేవంత్రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని మోదీని సభలో ప్రశంసించిన తీరును చేస్తే ఆయనలో ఏక్నాథ్ షిండే కనిపిస్తున్నాడని, మహారాష్ట్ర, అస్సాం సీఎంల మాదిరిగానే రేవంత్ కూడా మారుతాడని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ అన్నారు. ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో మహారాష్ట్ర, అస్సాంలో ఇలాగే మాట్లాడిన వారు తర్వాత పార్టీ మారి.. మోదీకి మద్దతు తెలిపారని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని విమర్శిస్తుంటే.. రేవంత్రెడ్డి మాత్రం ‘మోదీ మేరా బడా భాయ్’ అంటూ చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటో కాంగ్రెస్ నాయకులే చెప్పాలన్నారు. రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను తీసుకొస్తే.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేతలు, ప్రస్తుత మంత్రులు ఎల్ఆర్ఎస్పై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 80 రోజులు దాటినా ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు ఎందుకు వేయలేదో ముగ్గురు జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సభలో కేసీఆర్.. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే ఖమ్మంలో నీళ్ల ట్యాంకులు తిరుగుతాయని చెప్పారని, ఆ మాటే ఇప్పుడు నిజమైందన్నారు. కేసీఆర్ బీసీల పక్షపాతి కావడంతోనే వద్దిరాజు రవిచంద్రకు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారన్నారు.
ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును ఖరారు చేశారని, ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గురువారం మామిళ్లగూడెంలోని వీవీసీ ఫంక్షన్ హాల్లో ఖమ్మం పార్లమెంటరీ స్థాయి విస్తృత సమావేశం ఉంటుందని, సాయంత్రం బైపాస్ రోడ్లోని చెన్నై షాపింగ్ మాల్ పకన గాయత్రీ గ్రౌండ్లో ‘కేసీఆర్కు కృతజ్ఞత’ సభ ఉంటుందని, దీనికి బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారని, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ జిల్లా యువజన అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య, నాయకులు ఖమర్, ఉప్పల వెంకటరమణ, బొమ్మెర రామ్మూర్తి, డోకపర్తి సుబ్బారావు, లింగబోయిన సతీశ్, పగడాల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.