ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ ఎంఎల్సీ అభ్యర్ధిగా తాతా మధుసూధన్ గెలుపొందిన సందర్బంగా బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్ను ఆయన నివాసంలో తాతా మధు మార్యదపూర్వకంగా కలిసి తన గెలుపుకోసం కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువా కప్పి ఆయన్ను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కమల్రాజ్ సతీమణి, కుమారుడు, కుమార్తె, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, ఖమ్మం రూరల్ జడ్పీటీసీ వరప్రసాద్, జిల్లా రైతు బంధు సభ్యులు చుంచు విజయ్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.