ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తాతా మధుసూధన్ బుధవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి స్వగృహంలో మంత్రి పువ్వాడను కలిసిన మధు మంత్రిని శాలువాతో సత్కరించారు. అనంతరం మంత్రి తాతా మధును శాలువాతో సత్కరించి పూల మొక్కను అందచేసి అభినందించారు.
తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని తాతా మధు అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కార్యాలయ ఇన్ఛార్జి అర్జేసి కృష్ణ, ఖమ్మం వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి ప్రసన్న, టిఆర్ఎస్ నాయకులు నున్నా మాధవరావు ,రుద్రగాని ఉపేందర్లు పాల్గొన్నారు.