ఏన్కూరు: మండలంలోని రేపల్లెవాడకు చెందిన నిమ్మల పిచ్చయ్య(65) అనారోగ్యంతో బుధవారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబసభ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాణోతు సురేష్నాయక్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మేడా ధర్మారావుఉ, మార్కెట్ కమిటీ చైర్మన్ భుక్యా లాలునాయక్, సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు పూర్ణకంటి మైసారావు, మజీద్ఖాన్, చింతనబోయిన రాములు, తదితరులు పాల్గొన్నారు.