లక్ష్మీదేవిపల్లి, అక్టోబర్ 8 : నియోజకవర్గ ప్రజలు నా దేవుళ్లని, నేను పూజారిని మాత్రమేనని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పేదోడి సొంతింటి కలను సాకారం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఆదివారం మండలంలోని సుమారు 450 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే దేశానికి ఆదర్శమని అన్నారు. ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూర్చడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కొందరు డబ్బు సంచులతో ఎన్నికల్లో మీ ముందుకొస్తున్నారని, వారితో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, ఎంపీపీ భూక్యా సోనా, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో రమేశ్, ఎంపీవో శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ భూక్యా రాంబాబు, సొసైటీ చైర్మన్ మండె వీరహన్మంతరావు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, ఉర్దూఘర్ కమిటీ చైర్మన్ అన్వర్పాషా, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, మండల పార్టీ అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు కొల్లు పద్మ, స్వాతి, బాబురావు, మూర్తి, కోఆప్షన్ సభ్యు డు జక్కుల సుందర్, సర్పంచ్లు, డైరెక్టర్లు, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.