కల్లూరు: కల్లూరుమండల పరిధిలోని కప్పలబంధం గ్రామానికి చెందిన లక్కిరెడ్డి వీరారెడ్డి ఇటీవల మృతిచెందారు. సోమవారం నిర్వహించిన ఆయన సంస్మరణ సభకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్కిరెడ్డి వీరారెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే సండ్ర నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వెంట సాంబశివరెడ్డి, సదాశివరెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.