పెనుబల్లి: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బాధిత కుటుంబాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య పరామర్శించారు. మండలపరిధిలోని కుప్పెనకుంట్ల గ్రామానికి చెందిన గోసు రాములు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీనితో వారి కుటుంబసభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఆయన వెంట స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.