తల్లాడ, అక్టోబర్ 8: 55 ఏళ్ల పాటు కేంద్ర, రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆరు స్కీంల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కేశవాపురంలో సీసీరోడ్లు, గ్రావెల్రోడ్లు, నర్సింహారావుపేటలో సీసీ రోడ్లు ప్రారంభోత్సవాలు, గోపాలపేటలో ఎస్సీ కమ్యునిటీహాల్ శంకుస్థాపన, బాలపేటలో రూ.75 లక్షలతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో సండ్ర మాట్లాడుతూ 55 ఏళ్లలో ప్రజాసంక్షేమం కోసం గుర్తుకు రాని స్కీంలు ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చాయో ఒక్కసారి అధికారం ఇవ్వాలంటూ వస్తున్న మాయమాటలు నమ్మవద్దని, అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడే ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆశీర్వదించాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు అడిగినన్ని ప్రజలు మంజూరు చేసి నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ 11 సార్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాసంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదన్నారు. సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో దేశమే ఆశ్చర్యపడేలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలిపారన్నారు. ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కే ఉందన్నారు. దళితబంధుపై చేసే అపోహలు నమ్మవద్దని, అర్హులందరికీ వర్తింప చేస్తామన్నారు. అడిగిన వెంటనే నియోజకవర్గం మొత్తానికి సీఎం కేసీఆర్ దళితబంధు మంజూరు చేశారన్నారు. సాగర్జలాలు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఎడమ కాలువకు నీళ్లు వదిలారన్నారు. పాలేరు నుంచి వచ్చిన నీటితో రెండు తడులు పంటలకు అందిస్తామన్నారు. కేశవాపురంలో చావా ప్రసాద్ జ్ఞాపకార్థం నిర్మించిన అభివృద్ధి భవనాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. తల్లి జ్ఞాపకార్థం కూతుళ్లు భవనం నిర్మించి గ్రామాలకు అప్పగించడం అభినందనీయమన్నారు. ప్రసాద్ కూతురు ఝాన్సీని సన్మానించారు.
మండలంలోని నర్సింరావుపేటలో ఇటీవల మృతిచెందిన కోసూరి నర్సింహారావు కుటుంబాన్ని సండ్ర పరామర్శించి నర్సింహారావు చిత్రపటానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్రెడ్డి, ఏఎంసీ వైస్చైర్మన్ దూపాటి భధ్రరాజు, సర్పంచ్లు వనిగండ్ల అలైఖ్య, బద్ధం నిర్మల, కోసూరి వెంకటనరసింహారావు, నల్లమోతు మోహన్రావు, శీలం కోటారెడ్డి, జొన్నలగడ్డ కిరణ్, వనిగండ్ల అశోక్, కుర్నవల్లి సొసైటీ చైర్మన్ అయిలూరి ప్రదీప్రెడ్డి, ఎంపీటీసీ ఆదూరి వెంకటేశ్వర్లు, వరపర్ల ఉదయ్, దూపాటి నరేష్రాజు, కొమ్మినేని శ్రీనివాసరావు, నున్నా తిరుమలరావు, తదితరులు పాల్గొన్నారు.
తల్లాడ, అక్టోబర్ 8: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ప్రజలు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం మండలంలోని రెడ్డిగూడెంలో సర్పంచ్ బద్ధం నిర్మల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 కుటుంబాలు, కేశవాపురంలో సర్పంచ్ వనిగండ్ల అలైఖ్య ఆధ్వర్యంలో సీపీఎంకు చెందిన ఐదు కుటుంబాలు బీఆర్ఎస్లో చేరారు. వీరికి సండ్ర గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సండ్ర మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా దళితులకు పూర్తి సబ్సిడీతో రూ.10 లక్షలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. దళితబంధు పథకాన్ని సత్తుపల్లి నియోజకవర్గానికి కేటాయించినందుకు దళితులు ప్రత్యేకంగా సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సండ్రకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్రెడ్డి, ఏఎంసీ వైస్చైర్మన్ దూపాటి భద్రరాజు, సర్పంచ్లు బద్ధం నిర్మల, వనిగండ్ల అలైఖ్య, శీలం కోటారెడ్డి, జొన్నలగడ్డ కిరణ్, బద్ధం కోటిరెడ్డి, వనిగండ్ల అశోక్, మాధవరావు, దూపాటి నరేశ్రాజు తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి టౌన్, అక్టోబర్ 8: మైనార్టీల సంక్షేమానికి సర్కారు పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొత్తూరు రైతువేదిక వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని 92 మంది ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు, 32 మంది లబ్ధిదారులకు మైనార్టీలకు అందిస్తున్న రూ.లక్ష చెక్కులను అందజేసి మాట్లాడారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి ఉన్నతమైన విద్యను అందిస్తుందని చెప్పారు. షాదీముబారక్ పథకం కింద రూ.లక్ష ఇస్తూ సీఎం కేసీఆర్ భరోసా కల్పిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోమారు ఆశీర్వదించి పట్టం కట్టాలని సండ్ర కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, సత్తుపల్లి, వేంసూరు ఎంపీపీలు దొడ్డా హైమావతి, పగుట్ల వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, కౌన్సిలర్లు చాంద్పాషా, మట్టా ప్రసాద్, నాయకులు రఫీ, మల్లూరు అంకమరాజు, వేంసూరు నాయకులు తదితరులు పాల్గొన్నారు.