పెనుబల్లి/ వేంసూరు, ఆగస్టు 25: సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. బీఆర్ఎస్ సర్కారులోనే ఇంటింటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అందాయని వివరించారు. అందుకని పథకాల లబ్ధిదారులందరూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. దివ్యాంగుల పింఛన్ను రూ.3016 నుంచి రూ.4016కు ప్రభుత్వం పెంచినందున వాటి మంజూరు పత్రాలను పెనుబల్లి మండలంలోని దివ్యాంగులకు శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెనుబల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెనుబల్లి మండలంలో 1002 మంది దివ్యాంగ లబ్ధిదారులు ఉన్నారని, వారికి పెంచిన పింఛన్ ప్రకారం రూ.40,24,032 మంజూరయ్యాయని తెలిపారు. అనంతరం దివ్యాంగులతో సహఫంక్తి భోజనాలు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు వాసు, చెక్కిలాల మోహన్రావు, శ్రీనివాస్, సిద్ధార్థ, తావునాయక్, లక్ష్మీకాంతం, మందడపు అశోక్కుమార్, షేక్ గౌస్, కనగాల వెంకట్రావ్ పాల్గొన్నారు.
5,100 మంది దివ్యాంగులకు లబ్ధి..
సత్తుపల్లి నియోజకవర్గంలో 5,100 మంది దివ్యాంగులున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఇక నుంచి వారికి నెలకు రూ.4016 చొప్పున నెలకు రూ.2 కోట్లకు పైగా ఆసరా పింఛన్లు అందుతాయని వివరించారు. వేంసూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఇన్చార్జి ఎంపీడీవో రంజిత్కుమార్ అధ్యక్షతన నిర్వహించిన శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగుల ఆసరా పింఛన్ పెంపుదల మంజూరు పత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు. అనంతరం దివ్యాంగులకు స్వయంగా భోజనం వడ్డించారు. తరువాత 19 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పగుట్ల వెంకటేశ్వరరావు, మారోజు సుమలత, అశోక్చక్రవర్తి, గొర్ల సంజీవరెడ్డి, రాజు, కరుణశ్రీ, దొడ్డా శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.