పెనుబల్లి: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెనుబల్లి మండలంలో ఇరుముడి కార్యక్రమాలతో పాటు మండలంలో పలు చర్చిల్లో జరుగుతున్న సెమి క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బుధవారం పాల్గొన్నారు. వీయం బంజరు శ్రీ కనకదుర్గ దేవాలయంలో జరిగిన ఇరుముడుల కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాలధారణ చేసిన భక్తులు శబరిమల యాత్ర విజయవంతం కావాలని అభిలాషించారు.
అలాగే వీయంబంజరు చర్చిలో సెమిక్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు కనగాల వెంకటరావు, ప్రధాన కార్యదర్శి భూక్యా ప్రసాద్, సర్పంచ్లు తేజావత్ తావూనాయక్, భూక్యా పంతులి, సీడీసీ ఛైర్మన్ ముక్కర భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.