సత్తుపల్లి, మే 23: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్ను కలిశారు. మంత్రి అజయ్తో కలిసి వెళ్లిన ఆయన.. తొలుత ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. సత్తుపల్లి నియోజకవర్గంలోని జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వీఆర్ఏలు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సత్తుపల్లిలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు.
మంత్రి హరీశ్రావుకు ఎమ్మెల్యే సండ్ర కృతజ్ఞతలు
నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్యశాలల నూతన భవనాల నిర్మాణానికి, ప్రాథమిక వైద్య కేంద్రాల్లో సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేసి సహకారం అందించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావుకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే సండ్ర.. హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రి హరీశ్రావును ప్రత్యేకంగా కలిసి థ్యాంక్స్ చెప్పారు.