సత్తుపల్లి రూరల్, జూలై 13: కర్షకులపై కాంగ్రెస్ది కపట ప్రేమ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే అన్నదాతలు అధోగతి పాలవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు గంటల విద్యుత్ చాలంటున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటలు కాంగ్రెస్ అసలు నైజాన్ని బయటపెడుతున్నాయని అన్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను నిరసస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండలంలోని గంగారం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద గురువారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రేవంత్రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం దానికి ఉరి తీసి దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంటు కోతలు తప్పవన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు వాసు, హైమావతి, రామారావు, శ్రీనివాసరెడ్డి, కళావతి, శ్రీను, కృష్ణమూర్తి, కృష్ణారెడ్డి, వెంకటేశ్వరరావు, దామోదర్రెడ్డి, రాంబాబు, ఖాసీం, అంకమరాజు, రాజేశ్, ప్రభాకర్, ప్రసాద్ పాల్గొన్నారు.