నమస్తే : మీరు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఏయే అభివృద్ధి పనులు చేపట్టారు?
రేగా: నియోజకవర్గంలో ఐదేళ్లలో రూ.30 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాను. నా హయాంలో బీటీపీఎస్ పనులు పూర్తికావడం ఆనందాన్నిచ్చింది. మణుగూరు ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాను. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి అభివృద్ధి పనులు మొదలు పెట్టి పూర్తి చేశాను. వచ్చే ఎన్నికల్లో గెలిచి మరిన్ని అభివృద్ధి పనులు చేపడతాను.
రేగా: నా హయాంలో సీతారామ ప్రాజెక్ట్ పనులు వేగవంతమయ్యాయి. సీతమ్మ బరాజ్ ప్రాజెక్ట్ పనులకు అడుగులు పడ్డాయి. పులుసు బొంత ప్రాజెక్ట్ పనులు చేపట్టాం. ప్రాజెక్ట్ పూర్తయితే 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మారెళ్లపాడు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.300 కోట్ల నిధులు తెచ్చాను. ప్రాజెక్ట్ పూర్తయితే 30 వేల ఎకరాలు సస్యశ్యామలమవుతాయి.
రేగా : గిరిజనుల అభ్యున్నతే ధ్యేయంగా నేను రాజకీయాల్లోకి వచ్చాను. వారికి సేవ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. చరిత్రలో నిలిచిపోయేలా అర్హులైన పోడు రైతులందరికీ పట్టాలు అందించేందుకు కృషి చేశాను. ట్రైకార్ ద్వారా స్వయం ఉపాధి కోసం రుణాలు ఇప్పించాను. పంటలకు త్రీఫేజ్ కరెంట్ అందించేలా చర్యలు తీసుకున్నాను. నియోజకవర్గంలో గిరిజన భవన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేశాను. బీఆర్ఎస్ హయాంలోనే గిరిజనుల జీవన ప్రమాణాలు మారాయి.
రేగా : ప్రతి గ్రామంలో అద్భుతమైన ఆదరణ లభిస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, రూ.400కే గ్యాస్ సిలిండర్, నిరుపేద మహిళలకు రూ.3 వేలు, కేసీఆర్ బీమా పథకాలపైనే గ్రామాల్లో చర్చ నడుస్తున్నది. నాకు క్షేత్రస్థాయిలో ప్రజాబలం ఉంది. ప్రజలే నాకు ఓటు వేసి గెలిపించుకుంటారు. అత్యధిక మెజారిటీ కట్టబెడతారు.
రేగా: నాకెవరూ పోటీలేదు. వాళ్లవి డబ్బు రాజకీయాలు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిని ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు ప్రజలకు ఏమీ చేయలేదు. నియోజవర్గంలో ఎక్కడా అభివృద్ధి పనులు చేపట్టలేదు. అందుకే ప్రజలు ఆయన్ను గత ఎన్నికల్లో ఓడించారు. ఈ ఎన్నికల్లోనూ విజయం నాదే. ఆయన మన్యం ప్రజల నుంచి పుట్టిన నేత.. గిరిజనుల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతూ పినపాక నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించిన లీడర్. ఒకవైపు బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా పార్టీ కార్యకలాపాలను చూసుకుంటూనే మరోవైపు ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేశారు. ఆయన నిబద్ధతను గుర్తించిన గులాబీ సేన అధిపేత కేసీఆర్ ప్రభుత్వ విప్ అనే పదవిని కూడా కట్టబెట్టారు. రేగా కాంతారావు ప్రస్తుతం ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ‘నమస్తే’ చిట్ చాట్.
రేగా : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఇతర పార్టీ నాయకులనూ ఆకర్షిస్తున్నాయి. ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలూ ప్రభుత్వ ఫలాలను అందుకుంటున్నారు. దళితబంధు, రైతుబంధు, రైతుబీమా, ఆసరా, గిరి వికాస్, ట్రైకార్ రుణాలు.. ఇలా ఎన్నో పథకాలు వారికి ఆకట్టుకుంటున్నాయి. అందుకే బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.