సారపాక, ఫిబ్రవరి 22: తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్మోడల్గా నిలుస్తోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో అన్ని రాష్ర్టాలకంటే మిన్నగా ఉందని గుర్తుచేశారు. బూర్గంపహాడ్ మండలంలో రూ.4.80 కోట్లతో చేపట్టిన కొమ్ము నకిరిపేట – వేపలగడ్డ, నకిరిపేట – గోపాలపురంతోపాటు చెరువు సింగారం బీటీ రోడ్ల నిర్మాణాలకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి దేశమంతటా జరగాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని అన్నారు. కేసీఆర్ చేపట్టిన జాతీయ రాజకీయాల ప్రవేశాన్ని ప్రజలు ఆశీర్వదించి అండగా నిలవాలని కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పినపాక నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దున్నట్లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు.
దళితసాధికారతే సీఎం కేసీఆర్ ధ్యేయం..
దళిత సాధికారతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని, ఇందుకోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టి అమలుచేస్తున్న దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మండలంలోని సోంపల్లికి చెందిన లబ్ధిదారుడు బింగి తిరుపతిరావుకు దళితబంధు కింద మంజూరైన అప్పీ ఆటోను మర్రికుంట సభలో రేగా అందజేసి మాట్లాడారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడిని ఆ ఆటోలో ఎక్కించుకొని ఆయనే కొద్దిసేపు నడిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు భగవాన్రెడ్డి, వివేక్రామ్, రాములు, వెంకటేశ్వర్లు, రవితేజ, కామిరెడ్డి శ్రీలత, ముత్యాలమ్మ, బిక్కసాని శ్రీనివాసరావు, గోపిరెడ్డి రమణారెడ్డి, జలగం జగదీశ్, వల్లూరిపల్లి వంశీకృష్ణ, కుంజా చిన్నబ్బాయి, సర్పా వెంకటేశ్వర్లు, కుర్సం వెంకటరమణ, భూక్యా శ్రావణి, జక్కం సుబ్రమణ్యం, కామిరెడ్డి రామకొండారెడ్డి, మేడం లక్ష్మీనారాయణరెడ్డి, పొడియం నరేందర్, కొనకంచి శ్రీను, బెజ్జంకి కనకాచారి, సాబీర్పాషా, శ్రీను, తిరుపతి ఏసోబు, పూర్ణ, సోము లక్ష్మీచైతన్యరెడ్డి, బాలి శ్రీహరి, కుర్సం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.