ముంబై, ఆగస్టు 17: ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్ యోధ.. తమ ప్రతిష్ఠాత్మక ఎల్5 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ త్రీవీలర్లో లిమిటెడ్ ఎడిషన్గా ‘ఈపీవోడీ-భారత్’ మాడల్ను ఆవిష్కరించింది. ఇది ఓ హస్త కళల వెర్షన్ కావడం విశేషం. సెల్ఫ్-ఎంప్లాయ్డ్ డ్రైవర్లు, మొబిలిటీ ఆంత్రప్రెన్యూర్స్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని అభివృద్ధిపర్చామంటున్న కంపెనీ.. ప్రారంభ ధరను రూ.3.20 లక్షలుగా నిర్ణయించింది.
కాగా, ప్యాసింజర్ త్రీవీలర్ సహా మూడు కొత్త వాహనాలను మార్కెట్కు పరిచయం చేసే యోచనలో ఉన్నట్టు ఈ సందర్భంగా సంస్థ వెల్లడించింది. రెండు సరకు రవాణా త్రీవీలర్లను తేనున్నట్టు వివరించింది.