వైరా రూరల్/ వైరా టౌన్, జూన్ 20: విద్యాభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నది దేశంలోకెల్లా బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పన కోసమే ‘మన ఊరు/ మన బస్తీ మన బడి’ కార్యక్రమానికి సీఎం కేసీఆర్కు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా వైరా మండలం రెబ్బవరం గ్రామంలో మంగళవారం నిర్వహించిన విద్యా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం సిద్ధించిన 70 ఏళ్లలో ప్రభుత్వ విద్య బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి చేసినట్లుగా మరెవ్వరూ చేయలేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ‘మన బడి’ కార్యక్రమం ద్వారా పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులను ఎమ్మెల్యే రాములునాయక్ ప్రారంభించారు. అనంతరం పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, రాగి జావను పంపిణీ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు శివన్నారాయణ, సాదం రామారావు, రాయల రమేశ్, బీడీకే రత్నం, బాణాల వెంకటేశ్వరరావు, నంబూరి కనకదుర్గ, వేల్పుల పావని, లాల్మహ్మద్, యరమల రవీందర్రెడ్డి, మచ్చా వెంకటేశ్వరరావు (బుజ్జి),మద్దెల రవి, కట్టా కృష్ణార్జున్రావు, ముళ్లపాటి సీతారాములు, పసుపులేటి మోహన్రావు, శీలం విజయలక్ష్మి, యరమల సౌజన్య, జయరాజు, శేషరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏన్కూరులో..
విద్యా దినోత్సవం సందర్భంగా ఏన్కూరు పట్టణంలో విద్యార్థులతో భారీ ర్యాలీని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, అల్పాహారం, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ విద్య బలోపేతానికి సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు జయరాజు, అశోక్, రవీందర్, శ్రీనివాస్రెడ్డి, సురేశ్నాయక్, రుక్మిణి, కృష్ణవేణి, వెంకటేశ్వరరావు, చందూలాల్నాయక్, ధర్మారావు, లాలు, మైసారావు, కృష్ణార్జున్రావు, మోహన్రావు, శివ, కాంతి, బాలాజి, ప్రసాద్, శ్రీకాంత్ కృష్ణప్రియ, సుధాకర్, సీతారాములు, దుదియా, హనుమంత్, ఈశ్వర్నాయక్, వెంకన్న, అరవింద్, వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.