కూసుమంచి: రోడ్డు ప్రమాదంలో మరణించిన బెటాలియన్ కానిస్టేబుల్ కనకం వీరబాబు అంతిమ యాత్ర గురువారం జరిగింది. కూసుమంచి మండలం కేంద్రంలో బెటాలియన్ పోలీసులతోపాటు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో అధికారలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కూసుమంచి సెంటర్ నుంచి స్మశాన వాటికకు ఊరేగింపు నిర్వహించారు. అంతిమయాత్రలో వందలాది మంది పాల్గొని అతనికి కడసారి వీడ్కోలు పలికారు.
వీరబాబు అంత్యక్రియల్లో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. ” వీరబాబు మరణం చాలా బాధాకరమని అయితే ఆయన మరణించిన తరవాత అవయవ దానం చేయటం గొప్పవిషయమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాణోత్ శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, కూసుమంచి సర్పంచ్ చెన్నా మోహన్, ఎంపీటీసీ మాదాసు ఉపేందర్ రావు, మండల పార్టీ అద్యక్షులు చాట్ల పరశురాం, రూరల మండలపార్టీ అధ్యక్షులు బెల్లం వేణు, సీఐ సతీశ్,ఎస్ఐ నదీప్ పార్టీ నాయకులు బారి వీరభద్రం, అర్వపల్లి జనార్ధన్,కొండా మహిపాల్,గ్రామశాఖ అద్యక్షకార్యదర్శులు కొక్కిరేణి సీతారాములు, అర్వపల్లి ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.