అశ్వారావుపేట రూరల్, జూలై 9: పోడు పట్టాల పంపిణీ చరిత్రాత్మకమని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని కన్నాయిగూడెం, కావడిగుండ్ల, గుమ్మడవల్లి, నందిపాడు, దురదపాడు, కొత్త మామిళ్లవారిగూడెం, తిరుమలకుంట పంచాయతీలకు చెందిన 1,977 మందికి పోడు పట్టాలు పంపిణీ చేసి మాట్లాడారు. పట్టాల పంపిణీకి గతంలో ఏ ప్రభుత్వమూ చొరవ చూపలేదన్నారు. సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని గిరిజనులకు పట్టాలు ఇస్తున్నారన్నారు. తద్వారా రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు వర్తింపజేస్తున్నారన్నారు.
రైతుబాంధవుడు కేసీఆర్ అని కొనియాడారు. ఇకనుంచి పోడు రైతులకు యంత్రాంగం నుంచి ఎలాంటి వేధింపులు ఉండవన్నారు. అటవీశాఖ పెట్టిన కేసులన్నింటినీ ప్రభుత్వం మున్ముందు ఎత్తివేస్తుందన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో అత్యధికంగా కన్నాయిగూడెం పంచాయతీలో 494 మందికి పట్టాలు అందాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు గొంది లక్ష్మణరావు, భూలక్ష్మి, సీత, వీరాస్వామి, లక్ష్మి, నాగమణి, సరస్వతి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, జడ్పీటీసీ వరలక్ష్మి, ఎంపీటీసీలు వాసం బుచ్చిరాజు, వలెపు తిరుపతిరావు, రాజు, నారం నాగలక్ష్మి, నాయకులు బండి పుల్లారావు, బీఆర్ఎస్ నాయకులు మందపాటి మోహన్రెడ్డి, నారం రాజశేఖర్, నిర్మల పుల్లారావు, చిన్నంశెట్టి వెంకట నర్సింహం, న్యూడెమోక్రసీ నాయకలు కంగాల కల్లన్న, పుట్టా సత్యం, వెంకన్నబాబు, రాంబాబు, సున్నం రామలక్ష్మయ్యతోపాటు పలువురు పాల్గన్నారు.
బీఆర్ఎస్లోకి మాల్కారం సర్పంచ్
దమ్మపేట, జూలై 9: మల్కారం సర్పంచ్ రూప్ సింగ్ ఆదివారం వార్డు సభ్యులు, గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. ఆదివారం రాత్రి ఈ మేరకు గుత్తవారిగూడెంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీలకు చెందిన నేతలూ బీఆర్ఎస్కు ఆకర్షితులవుతున్నారన్నారు. దీనిలో భాగంగానే మాల్కారం సర్పంచ్ బీఆర్ఎస్లో చేరారన్నారు. పార్టీలో చేరిన వారు బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలన్నారు.
వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శాయశక్తులా పనిచేయాలని సూచించారు. సర్పంచ్ రూప్సింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరుకున్నదన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి లేదన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు, నాయకులు ఉమామహేశ్వరరావు, రాజా, వాసు, వెంకమ్మ, కోటేశ్వరరావు, జేమ్స్, అబ్దుల్ జిన్నా, సత్యనారాయణ పాల్గొన్నారు.