టేకులపల్లి, మార్చి 15: పశు సంపదను కాపాడేందుకే పశు వైద్య, పశుసంవర్ధకశాఖలు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నాయని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ బీ.పురంధర్ అధ్యక్షతన కోయగూడెంలో శుక్రవారం నిర్వహించిన పశువుల గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పశువైద్యులు సంతోశ్కుమార్, రాజేశ్, ఎల్ఎస్ఏ పార్వతి, జేవీవో సాధిక, సిబ్బంది వెంకటేశ్వర్లు, జయమ్మ, రైతులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట, మార్చి 15: వ్యాధి నిరోధక టీకాలతోనే పశువులు ఆరోగ్యంగా ఉంటాయని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సభ్యుడు చిన్నంశెట్టి వాసు అన్నారు. అందుకే ప్రభుత్వం టీకాలను ఉచితంగా అందిస్తోందని అన్నారు. మండలంలోని నారాయణపురంలో పశు వైద్య సిబ్బంది శుక్రవారం పర్యటించి పలు పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాధి నిరోధక టీకాలు వేయకుంటే పాల దిగుబడి తగ్గి ఆర్థికంగా నష్టం వస్తుందని వివరించారు. పశు వైద్యాధికారి డాక్టర్ స్వప్న, సిబ్బంది మదార్ బక్షీ, రేఖారాణి, బాబ్జీ, అశోక్, దుర్గాభవాని, ధర్మ, రాము, పుల్లారావు పాల్గొన్నారు.