పాల్వంచ రూరల్, మార్చి 23 : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించానని, త్వరలోనే అమలు చేసి ప్రజల సమస్యలు తీరుస్తానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. తోగ్గూడెంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాల్వంచ మండల సమగ్రాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు.
తోగ్గూడెంలో ముర్రేడు వాగుపై చెక్డ్యాం నిర్మించి రైతుల సాగు భూములకు ఇబ్బంది లేకుండా చూస్తానన్నారు. కాగా.. పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. కార్యక్రమంలో నాయకులు సాబీర్పాషా, ముత్యాల విశ్వనాథం, వీసంశెట్టి పూర్ణచందర్రావు, ఉప్పుశెట్టి రాహుల్, బండి నాగేశ్వరావు, సుధాకర్, అన్నారపు వెంకటేశ్వర్లు, శనగరపు శ్రీనివాసరావు, వెంకన్న , గిరి, జర్పుల మోహన్ తదితరులు పాల్గొన్నారు.