నేలకొండపల్లి, ఫిబ్రవరి 1: విద్యార్థులు ప్రభుత్వ బడిలో చదువుకునేలా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి తెలిపారు. ‘మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా సింగారెడ్డిపాలెం ప్రాథమిక పాఠశాలను ఆయన బుధవారం సాయంత్రం ప్రారంభించి మాట్లాడారు. పాఠశాల పక్కనే ఉన్న పశువైద్యశాలను మరో చోటికి మార్చి ఆస్థలాన్ని విద్యార్థులకు ఆట స్థలంగా మార్చాలని ఎమ్మెల్యే అధికారులకు తెలిపారు.
కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరికంటి ధనలక్ష్మీ, వజ్జా రమ్య, రాయపూడి నవీన్, శ్యాంప్రసాద్, జమలారెడ్డి, ప్రసాద్, బొడ్డు బొందయ్య, దోసపాటి కల్పన, శీలం వెంకటలక్ష్మి, హరి శ్రీనివాసరావు, ఉన్నం బ్రహ్మయ్య, నెల్లూరి లీలాప్రసాద్, డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న రావూరి సూరయ్య, కృష్ణయ్యలను ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి బుధవారం పరామర్శించారు.
పేద విద్యార్థుల కోసమే ‘మన ఊరు -మనబడి’
కూసుమంచి రూరల్, ఫిబ్రవరి 1: గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం మన ఊరు – మనబడి పథకం కింద పాఠశాలలను అభివృద్ధి పరుస్తుందని మల్లేపల్లి సర్పంచ్ పొట్టపింజర నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ పీ.అజయ్బాబు అన్నారు. మల్లేపల్లి జెడ్పీ హైస్కూల్లో బుధవారం ఎల్ఈడీ టీవీ ఏర్పాటు చేసి, ఆన్లైన్ తరగతుల ప్రసారాలను ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
ఇసుకలో అక్షరాలు దిద్దిన నాటి నుంచి ప్రస్తుతం డిజిటల్ క్లాస్రూం వరకు విద్యను అభివృద్ధి పర్చుకున్నామని ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఆళ్లపాడు ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఈవో ప్రభాకర్, ఇన్చార్జి తహసీల్దార్ శ్వేత, ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్, సర్పంచ్ మర్రి తిరుపతిరావు, ఉపసర్పంచ్ మల్లాది గంగమ్మ, ఎంపీటీసీ పారా శ్రీదేవి, ఎస్ఎంసీ చైర్మన్ కందుల పాపారావు, హెచ్ఎం పడిగల రవికుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కూసుమంచి రూరల్, ఫిబ్రవరి 1: కంటి వెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కరుణాకర్రెడ్డి విజ్ఞప్తిచేశారు. కిష్టాపురంలో బుధవారం కంటి వెలుగు శిబిరంలో మాట్లాడారు. శిబిరాన్ని సర్పంచ్ పందిరి పద్మ ప్రారంభించారు. మొదటి రోజు 116 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 34 మందికి కళ్లద్దాలు అందజేశారు.