ఇల్లెందు రూరల్, డిసెంబర్ 7 : పేదల పాలిట సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడు అని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఇల్లెందు మండలం మాణిక్యారం గ్రామానికి చెందిన బి.జోత్స్న కోమలికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన లక్ష రూపాయల ఎల్వోసీని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదరికంలో ఉండి చికిత్స చేయించుకోలేని నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతున్నదని అన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, నాయకులు యలమద్ది రవి, పంచాయతీ నాయకులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన ఎమ్మెల్యే
గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఎమ్మెల్యే హరిప్రియానాయక్ ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో కేసీఆర్ కిట్లు పంపిణీ చేసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, పులిగళ్ళ మాధవరావు, వైస్ చైర్మన్ జానీపాష, పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాయకులు రవి, నర్సింహారావు, వైద్యులు కవిత, శ్రీహర్ష, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.