ఇల్లెందు రూరల్, సెప్టెంబర్ 21 : గ్రామాలు, తండాలు అభివృద్ధి చెందాయంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనేనని, ప్రతీ పైసా ప్రజోపయోగానికే వినియోగిస్తున్నట్లు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ అన్నారు. గురువారం మండలంలోని పలు పంచాయతీల్లో రూ.3.10కోట్ల వ్యయంతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాఘబోయినగూడెం పంచాయతీలో రూ.9లక్షల ఎస్డీఎఫ్ నిధులతో అంతర్గత రోడ్లు, నారాయణపురంలో డీఎంఎఫ్టీ నిధులు రూ.15లక్షలతో అంతర్గత రోడ్లు, తెలగాగుంపులో డీఎంఎఫ్టీ నిధులు రూ.20లక్షలతో నాలుగు అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించామన్నారు. పూబెల్లి పంచాయతీలో ఎంఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.20లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, డీఎంఎఫ్టీ నిధులు రూ.15లక్షలతో మూడు అంతర్గత సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశామన్నారు. కొమరారం గ్రామ పంచాయతీలో డీఎంఎఫ్టీ నిధులు రూ.45లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, బొయితండా గ్రామ పంచాయతీలో డీఎంఎఫ్టీ నిధులు రూ.10లక్షలతో రెండు అంతర్గత సీసీ రోడ్లు, ఎల్లన్న నగర్లో డీఎంఎఫ్టీ నిధులు రూ.15లక్షలతో నాలుగు అంతర్గత సీసీ రోడ్లు, లక్ష్మీనారాయణతండాలో డీఎంఎఫ్టీ నిధులు రూ.10లక్షలతో రెండు అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించామన్నారు.
ముత్తారపుకట్ట జీపీలోని లక్ష్మీనారాయణతండాలో డీఎంఎఫ్టీ నిధులు రూ.20లక్షలతో నాలుగు అంతర్గత సీసీ రోడ్లతోపాటు ఎంఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.20లక్షలతో ముత్తారపుకట్ట గ్రామ పంచాయతీకి నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. మసివాగు గ్రామ పంచాయతీలోని లక్ష్మీనారాయణతండాలో డీఎంఎఫ్టీ నిధులు రూ.15లక్షలతో మూడు అంతర్గత సీసీ రోడ్లు, ధర్మారంతండాలో డీఎంఎఫ్టీ నిధులు రూ.20లక్షలతో నాలుగు అంతర్గత సీసీ రోడ్లు, ఎంఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.20లక్షలతో నాలుగు సీసీ రోడ్లను ప్రారంభించుకున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తూ సీఎం కేసీఆర్ సహకరిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ముందు అన్ని పార్టీలు గల్లంతవుతాయన్నారు. అనంతరం ఎమ్మెల్యేకు మహిళలు హారతులు పట్టి.. పూలుచల్లి స్వాగతాలు పలికారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బానోత్ హరిసింగ్నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శీలం రమేశ్, ఖమ్మంపాటి రేణుక, జెడ్పీటీసీ ఉమాదేవి, డీఈ రామకృష్ణ, ఏఈ రాజు, నాయకులు బండారు వెంకన్న, లష్కర్, మెట్ల కృష్ణ, జనగం కోటేశ్వరరావు, దాస్యం ప్రమోద్, ఘాజీ, నీలం రాజశేఖర్, ప్రేమ్, మల్సూర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.