ఖమ్మం, జనవరి 28: ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ హజ్రత్ సయ్యద్ యాకూబ్ పావలీ దర్గాహ్లో ఆదివారం ఉర్సు ఉత్సవాలు జరిగాయి. ఈ ఆధ్యాత్మిక ఉత్సవానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు.
చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థన చేశారు. కార్యక్రమంలో దర్గా ముజవార్ షేక్ హబీబున్, నిర్వాహకులు సల్మాన్, సాహెబ్, హుస్సేన్, నాగుల్ మీరా, ఖాజామియా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆస్రిఫ్, ఖదీర్, జాకీర్, నవాజ్, షబ్బీర్, సోహెల్ పాల్గొన్నారు.