ఖమ్మం, అక్టోబర్ 19 : ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమన్వయకర్తగా గుండాల(ఆర్జేసీ) కృష్ణను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించిన విషయం విదితమే. ఈ మేరకు గురువారం ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సమన్వయకర్త ఆర్జేసీ కృష్ణ, సమన్వయ కమిటీ(వార్ రూమ్) సభ్యులుగా నియామకమైన ఉప్పల వెంకటరమణ, ఎండీ ఖమర్, చింతనిప్పు కృష్ణచైతన్య, పులిపాటి ప్రసాద్, చిత్తారు సింహాద్రి యాదవ్, ఆకుల మూర్తి, డోకుపర్తి సుబ్బారావు, యాతాకుల భాసర్, బోయినపల్లి కృష్ణమూర్తి, పోలీస్ వెంకన్నలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అభినందనలు తెలిపారు.
వారిని శాలువాతో సతరించారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.