రఘునాథపాలెం, మే 30: ఖమ్మం అభివృద్ధి హైదరాబాద్కు ఏమాత్రం తీసిపోని విధంగా జరి గిందని, అందుకు ప్రత్యక్ష నిద ర్శనమే ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఆలిండియా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖ మ్మం నగరం సర్దార్ పటేల్ స్టేడి యంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి మహిళల టీ-20 క్రికెట్ లీగ్ను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జాతీయస్థాయి మహిళా టీ -20 క్రికెట్ లీగ్ పోటీలు ఖమ్మంలో నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇందుకు క్రికెట్ లీగ్ చైర్మన్ డాక్టర్ కూ రపాటి ప్రదీప్ను మంత్రి అభినందిస్తున్నామని అన్నారు.
ఫ్లడ్ లైట్ల వెలుతురులోనూ క్రీడలను నిర్వహించుకునే విధంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ టీ-20 పోటీలకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. పలు రాష్ర్టాలకు చెందిన మహిళల క్రికెట్ జట్లు ఖమ్మంలో జరిగే క్రికెట్ లీగ్ టీ-20పోటీలకు వచ్చినందుకు అభినందించారు. ముందుగా పలు రాష్ర్టాల నుంచి వచ్చిన మహిళాక్రీడాకారులను కలిసి వారికి కరచాలనం అందించి శుభాకాం క్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్ కమర్తపు మురళీ, ఆలిండియా టీ-20 క్రికెట్ లీగ్ చైర్మన్ డాక్టర్ కూరపాటి ప్రదీప్, జిల్లా క్రీడల అధికారి పరందామరెడ్డి, నిర్వాహకులు పాల్గొన్నారు.